Pakistan Updating Nuclear Weapons: అణ్వాయుధాలను అప్డేట్ చేస్తున్న పాక్.. అమెరికా సంచలన కథనం

Pakistan Updating Nuclear Weapons: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ ఢిపెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత పాక్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని పేర్కొంది. అంతేగాక భారత్ ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని తెలిపింది. యుద్ధ సమయంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్ ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. గ్రోబల్ థ్రెట్ అసెస్మెంట్- 2025 పేరుతో రిలీజ్ చేసిన రిపోర్టులో డీఐఏ ఈ విషయాలు తెలిపింది.
భారత్ తో పాకిస్తాన్ కు ఎప్పటికైనా ముప్పు వాటిల్లుతుందని పాకిస్తాన్ భావిస్తోంది. అందుకే పాక్ సైనిక సామాగ్రి ఆధునీకరణకు మొగ్గు చూపుతోందని స్పష్టం అవుతోంది. అణ్వాయుధాలను అప్ గ్రేడ్ చేస్తోందని, తనకు సన్నిహితంగా ఉండే ఇతర దేశాల నుంచి ఆయుధాలు, సామాగ్రిని కొనుగోలు చేస్తోందని పేర్కొంది. సైనిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపైనే పాకిస్తాన్ ప్రధానంగా దృష్టి పెట్టిందని కథనం అంచనా వేసింది.
మరోవైపు చైనాతో పాకిస్తాన్ కు ఉన్న సంబంధాలపైనా డీఐఏ ఫోకస్ చేసింది. విధ్వంసకర ఆయుధాల తయారీకి పాక్ కు చైనా మద్దతు ఇస్తోందని తెలిసింది. ఆయుధాల తయారీకి కావాల్సిన సామాగ్రిని, సాంకేతికతను చైనా అందిస్తోందని వెల్లడించింది. ఇవి చైనా నేరుగా వస్తున్నాయని, కొన్ని సార్లు హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈ మీదుగా రవాణా అవుతున్నాయని పేర్కొంది.