Published On:

IPL 2025: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

IPL 2025: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

Gujarat Titans vs Mumbai Indians Eliminator Match IPL 2025: ఐపీఎల్‌ 2025లో మరో రసవత్తర మ్యాచ్ జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లాన్ పూర్ వేదికగా ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత ముంబై జట్టు టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

 

ఇరు జట్లు ఛాంపియన్‌గా నిలవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడితే ఆ జట్టు సీజన్ నుంచి నిష్క్రమిస్తుంది. అయితే గెలిచిన జట్టు మాత్రం క్వాలిఫయర్ 1 లో ఓడిన పంజాబ్ కింగ్స్ జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ క్వాలిఫయర్ 2 లో ఏ జట్టు గెలిచిన ఆర్సీబీతో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. గుజరాత్ జట్టు అర్హత సాధిస్తుంది. దీంతో నేరుగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

 

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రాజ్ అంగద్, ట్రెంట్ బౌల్ట్, శాంట్నర్, బుమ్రా, గ్లిసన్.

గుజరాత్ టైటాన్స్ జట్టు: శుభ్ మన్ గిల్(కెప్టెన్), సుదర్శన్, మెండిస్(వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, గెరాల్డ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.