Last Updated:

North Korea: దక్షిణకొరియా డ్రామాలను చూసినందుకు ఇద్దరు మైనర్లను కాల్చి చంపిన ఉత్తరకొరియా

దక్షిణ కొరియా నాటక ప్రదర్శనలను చూసినందుకు మరియు వాటిని స్నేహితుల మధ్య విస్తృతంగా పంపిణీ చేసినందుకు ఇద్దరు హైస్కూల్ విద్యార్థులను ఉత్తర కొరియా కాల్చిచంపింది.

North Korea: దక్షిణకొరియా డ్రామాలను చూసినందుకు ఇద్దరు మైనర్లను కాల్చి చంపిన ఉత్తరకొరియా

North Korea: దక్షిణ కొరియా నాటక ప్రదర్శనలను చూసినందుకు మరియు వాటిని స్నేహితుల మధ్య విస్తృతంగా పంపిణీ చేసినందుకు ఇద్దరు హైస్కూల్ విద్యార్థులను ఉత్తర కొరియా కాల్చిచంపింది. దక్షిణకొరియా డ్రామాలను చూడటం మరియు పంపిణీ చేయడం చట్టాలను ఉత్తరకొరియా చట్టాలను ఉల్లంఘించడమే. దీనికి మరణశిక్షవిధిస్తారు.

అక్టోబరు ప్రారంభంలో చైనాతో సరిహద్దును పంచుకునే ఉత్తర కొరియాలోని ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్దులు కలుసుకున్నారు.అక్కడ వారు అనేక కొరియన్ మరియు అమెరికన్ నాటక ప్రదర్శనలను చూసారు. అంతేకాదు వారు వాటిని తమ స్నేహితులతో షేర్ చేసుకున్నారు. దీనితో వారిద్దరినీ ఎయిర్‌ఫీల్డ్‌లో అధికారులు కాల్చివేసారు.

2020లో, ఉత్తర కొరియా సైద్ధాంతిక మరియు సాంస్కృతిక సాధనాలను నియంత్రించే చట్టాన్ని రూపొందించింది. కొరియన్ ప్రదర్శనలు మరియు సంగీతానికి పెరుగుతున్న ప్రజాదరణను లక్ష్యంగా చేసుకుని వీటిని నిషేధించింది.

ఇవి కూడా చదవండి: