Pakistan Army Chief Asim Munir: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మునీర్ ప్రమోషన్ తీసుకున్నాడా?

Pakistan Army Chief Asim Munir Promoted To Field Marshal To cover up his failures: పాకిస్తాన్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక వైపు ఇండియాతో యుద్ధంలో ఓడిపోయింది.. మరో వైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు అతి పెద్ద ప్రమోషన్ ఇవ్వడం పాక్కే చెల్లింది. దేశంలోని అత్యతున్న మిలిటరీ హోదా కలిగిన ఫీల్డ్ మార్సల్ అవార్డును ప్రకటించింది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. దీనికి కారణం ఏమిటంటే ఇటీవల ఇండియాతో జరిగిన యుద్ధంలో పాక్ మిలిటరీ సాధించిన విజయానికి గాను ఆయనకు ఫీల్డ్మార్షల్ హోదాను కట్టబెట్టారు. ఇక అసలు వాస్తవం ఏమిటంటే మునీర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రమోషన్ దక్కించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దీంతో మునీర్ దేశంలో మరింత శక్తిమంతైన ఆర్మీచీఫ్గా నిలుస్తాడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే యావత్ దేశం అతని కంట్రోల్లోకి వెళ్లిపోతుంది.
పాకిస్తాన్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు నవ్వుకోకుండా ఉండలేరు. కేవలం కొన్ని రోజుల క్రితమే ఇండియాతో యుద్ధానికి దిగి పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. పాక్ ఆర్మీచీఫ్ అసిమ్ మునీర్ నేతృత్వంలో అవమానకరంగా ఓడిపోయింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ పాక్ను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు. ఇండియా పేరు చెబితేనే ఆగ్రహంతో ఊగిపోయే మునీర్ను ‘హఫీజ్ -ఎ- ఖురాన్’ అంటారు అతడికి ఈ యుద్ధంలో ఇండియాపై సాధించిన విజయానికి గాను ప్రమోషన్ ఇచ్చి ఫీల్డ్ మార్షల్ హోదాను కట్టబెట్టారు. ఇక పాకిస్తాన్ పునాదులే అబద్దాలతో పుట్టింది. ఇలాంటివి అక్కడ సహజమే. ఇక పాక్ ప్రభుత్వం మునీర్కు అవార్డు ప్రకటిస్తూ జారీ చేసిన ప్రకటనలో ఇండియాతో జరిగిన యుద్ధంలో మునీర్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. ఆపరేషన్ బున్యాన్ అల్ మార్సూస్లో ఆయన నాయకత్వంలో ఇండియాను ఓడించాడు అని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మునీర్ను ప్రశంసలతో ముంచెత్తింది. యుద్ధంలో ఆయన సేవలను కొనియాడింది.
పాకిస్తాన్ ఫెడరల్ కేబినెట్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ నేతృత్వంలో మంగళవారం నాడు సమావేశం అయ్యింది. అసిమ్ మునీర్కు జనరల్ నుంచి పీల్డ్ మార్షల్గా ప్రమోషన్ను ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఆయన నేతృత్వంలో దేశం సురక్షితంగా ఉందని.. శత్రువుగాను సునాయాసంగా ఓడించాడు. ఈ యుద్ధంలో మునీర్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు అని ఒక ప్రకటనలో వివరించింది షరీఫ్ ప్రభుత్వం. జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ తనకు తానుగా ఫీల్డ్మార్షల్గా ప్రమోట్ చేసుకున్నాడంటూ బ్రిటన్కు చెందిన సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్ ఇమితియాజ్ మహమూద్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఎద్దేవా చేశాడు. ఇక పాకిస్తాన్కు చెందిన నిపుణులు మాత్రం తెర వెనుక పెద్ద రాజకీయం జరిగిందని బల్లగుద్ది మరి చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అత్యంత పవర్పుల్ ఆర్మీ .. అక్కడ షహబాజ్ షరీఫ్ లాంటి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని వెనుకుండా నడిపించేంది మునీర్ అని యావత్ పాకిస్తాన్కు తెలుసు. తనను ఫీల్డ్మార్షల్గా ప్రమోట్ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తన పంతం నెగ్గించుకున్నాడు.
అయితే పాకిస్తాన్లో గత కొన్ని దశాబ్దాలుగా ఫీల్డ్మార్షల్ పోజిషన్ ఎవ్వరికి ఇవ్వలేదు. చివరగా ఆర్మీ చీఫ్నుంచి పీల్డ్మార్షల్గా అయుబ్ఖాన్కు మాత్రమే ఆ గౌరవం దక్కింది. 1965లో ఇండియా – పాకిస్తాన్ యుద్ధం జరిగిన ప్పుడు ఆయన యుద్ధంలో చేసిన సేవలకు గాను పీల్డ్మార్షల్గా ఆయనకు ప్రమోషన్ దక్కింది. ఇక తాజాగా మునీర్ ఆ హెదాను దక్కించుకున్నాడు. ఇక మునీర్ను ఫీల్డ్మార్షల్గా ప్రకటించిన షరీఫ్ ప్రభుత్వం ఎంత నిస్సాహాయ స్థితిలో ఉందో తేలికగానే ఊహించుకోవచ్చు. షరీఫ్తో పాటు షరీఫ్ అడ్మినిస్ర్టేషన్ మునీర్ ఏది చెబితే దానికి తల ఊపాల్సిందే. ఎదురుమాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు. ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధించిందని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తన పదవిని మరింత పదిలపర్చుకున్నాడు. వాస్తవానికి ఆయన పదవి కాలం దాదాపు ముగియడానికి వస్తున్న సమయంలో షరీఫ్పై ఒత్తిడి తెచ్చి మరో రెండేళ్లు పెంచుకున్నాడు. 2027 నవంబర్ వరకు మునీర్ ఆర్మీ చీఫ్ కొనసాగతాడు. తాజా ఆయన ఫీల్డ్ మార్షల్ ఫ్రమోషన్ దక్కించుకున్న తర్వాత ప్రభుత్వంపై మరింత పట్టు సాధించినట్లవుతుంది. ముషారఫ్ 2.0 లోడింగ్ అవుతోందని ఇండియాకు చెందిన మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే రేపో మాపో మరోమారు దేశంలో మార్షల్ లా ప్రకటంచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నమాట.
మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం మునీర్ ప్రమోషన్ మెరిట్పై వచ్చింది కాదు. బలవంతంగా షహబాజ్ షరీఫ్ మెడపై కత్తి పెట్టి దక్కించుకున్న హోదా. దీంతో తన పదవిని మరింత పటిష్టం చేసుకున్నాడు. దీంతో పౌరప్రభుత్వం విలువే లేకుండాపోయింది. ఇక మునీర్ ప్రమోషన్ విషయానికి వస్తే.. పాకిస్తాన్ను రక్షించే వాడు కేవలం ఒకే ఒక్కడు మునీర్. అతడే ‘ హఫీజ్ ఏ ఖురాన్’ అంటూ పెద్దెత్తున ప్రచారం చేసుకున్నాడు. గత నెల 16వ తేదీన ఆయన ఓవర్ సీస్ పాకిస్తాన్ సదస్సులోమాట్లాడుతూ.. ఇండియాకు వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా విషం కక్కిన విషయం తెలిసిందే. ఆయన రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతనే గత నెల 22న ఫహల్గామ్లో టెర్రర్ దాడి జరిగంది. పాక్కు చెందిన లష్కర్ టెర్రరిస్టులు కశ్మీర్ పర్యటనకు వెళ్లిన వారిని మతం పేరు అడిగి హిందువా కాదా అని తెలుసుకొని వారి ప్యాంట్లు విప్పి సుంతి చేసుకున్నాడా లేదా అని నిర్ధారించుకుని దారుణంగా చంపిన విషయం తెలిసిందే.
అటు తర్వాత ఇండియా పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్దం ప్రకటించింది. ఇండియా అత్యాధునిక ఆయుధాలకు పాకిస్తాన్ నిలువునా వణికిపోయింది. పాక్ చెంత సొంతంగా ఆయుధాలు లేవు. చైనా నుంచి కొనుగోలు చేయాల్సిందే. చైనా ఆయుధాలు ఈ యుద్ధంలో పనిచేయలేదు. ఇండియా దెబ్బకు వణికిపోయిన షరీఫ్ ట్రంప్ కాళ్లవేళ్ల పడి కాల్పుల విరమణకు మోదీని ఒప్పించాడు. అయితే పాకిస్తాన్ ఈ యుధ్దాన్ని ‘ఆపరేషన్ బునియాన్ అల్ మార్సుస్’ పేరుతో ఇండియాపై దిగింది. యుద్ధంలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. అయితే మునీర్ లాంటి వారు పాక్ ప్రజలకు ఇండియాపై ఘన విజయం సాధించామని తప్పదోవ పట్టిస్తున్నారు. ఇక ఆపరేషన్ సిందూర్ పేరుతో ఇండియా పాక్ ఆక్రమిత కశ్మీర్లో తొమ్మిది టెర్రర్ స్థావరాలను మట్టు పెట్టింది. ఇండియా దాడిలో వంద మంది టెర్రిస్టులు దుర్మరణం పాలయ్యారు.
ఇండియా దాడికి పాకిస్తాన్ కూడా ప్రతీకార దాడి చేసింది కానీ.. పాక్ డ్రోన్లను ఇండియా సరిహద్దు వద్దనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా నిర్వీర్యం చేసింది ఇండియా. పాకిస్తాన్లోని తిమ్మిది ఎయిర్బేస్లను ఇండియా నేలమట్టం చేసింది. అవి రఫిక్, మురీద్, నూర్ఖాన్, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పాసుర్, సియాల్కోట్లపై ఈనెల 10న దాడి చేసింది. పాక్లోని 20 శాతం ఎయిర్బేస్లను ధ్వంసం చేసింది. రావల్పిండిలోని పాకిస్తాన్ మిలిటరీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ఖాన్ ఎయిర్బేస్ను ఇండియా ధ్వంసం చేసింది. నాలుగు రోజుల ఇండియా దాడిలో పాకిస్తాన్ నిలువునా వణికిపోయింది. మరో 48 గంటలు దాడిచేస్తే యావత్ దేశం ధ్వంసం అయ్యేది. ఇండియాను ఎదుర్కొవడంలో మునీర్ ఘోరంగా విఫలం అయ్యాడనేది మాత్రం వాస్తవం. ఇక ఇండియాను రెచ్చగొట్టి యుద్ధం వరకు తెచ్చింది కూడా మునీర్ అనే విషయం అందిరికి తెలిసిందే.
ప్రస్తుతం మునీర్కు క్రమంగా మిలిటరీలోను పట్టుకోల్పోతున్నాడు… ప్రజాదరణ తగ్గుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను అకారణంగా జైల్లో పెట్టాడు. ఆయన మద్దతుదారులు రోడ్డెక్కి ప్రభుత్వాన్ని చికాకుపరుస్తున్నారు. మరో పక్క దేశం ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేరుకుంది. దీంతో తన పట్టును మరింత పటిష్టం చేసుకోవడానికి ఆయన అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. వాస్తవానికి ఆర్మీ చీప్ పదవి మూడు సంవత్సరాలు అయితే దాన్ని ఆయన ఐదు సంవత్సరాలకు పొడిగించుకున్నాడు. ఈ యుద్ధంలో ఇండియాతో ఘరంగా ఓడిపోయినందుకు ఆయన అతి పెద్ద ప్రమోషన్ దక్కించుకోవడం పాక్ ప్రజలకు అవమానమే. ప్రజల్లో కోల్పోతున్న పట్టును తిరిగి దక్కించుకొనేందుకు దొడ్డిదారిన పీల్డ్మార్షల్ కీరిటాన్ని దక్కించుకున్నాడు. అయితే .పాకిస్తాన్ చరిత్ర తిరగేస్తే సైనిక తిరుగుబాట్లు మామూలే. స్వాతంత్ర్య వచ్చిన తర్వాత పౌరప్రభుత్వం సాఫీగా జరిగిన దాఖాల్లేవు. అంతా సైన్యం పత్తనమే. దాని ఫలితం అక్కడి ప్రజలు అనుభవించడమే అసలైన ట్రాజెడీ. లాంగ్ లివ్ పాకిస్తాన్ అని సానుభూతి తప్ప ఎవరైనా చేయగలిగింది ఏమీ లేదు.