PBSK vs RCB : టాస్ గెలిచి బ్యాటింగ్ కు ఆహ్వానించిన బెంగళూరు

IPL 2025 సీజన్ తుది దశకు చేరింది. నేడు పంజాబ్ తో బెంగళూరు ఢీకొననుంది. చంఢీగడ్ లోని ముల్లాన్ పుర్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో పంజాబ్ టీం బ్యాటింగ్ కు కాసేపట్లో దిగనుంది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్నాడు.
బెంగళూరు జట్టు.. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ ( కెప్టెన్) ఫిల్ సాల్ట్, లివింగ్ స్టన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షెపర్డ్, క్రుణాల్ పాండ్యా, భువనేశ్వర్, యష్ దయాల్, జోష్ హజెల్ వుడ్, సుయాష్ శర్మ
పంజాబ్ జట్టు… ప్రియాంశ్ ఆర్య, పి.సింగ్, జోష్ ఇంగ్లిస్ ( వికెట్ కీపర్). శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), నేహల్, శషాంక్ సింగ్, మార్కూస్, అజ్మతుల్లా, హార్ ప్రీత్ బ్రార్, కైల్, అర్శదీప్ సింగ్
ఈ మ్యచ్ లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాలని రెండు జట్లు ఉవ్వి్ళ్లూరుతున్నాయి. గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్న హజిల్ వుడ్ ఆర్సీబీలో జాయిన్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ బలంగా కనిపిస్తుంది. షెఫర్డ్ స్థానంలో హాజిల్ వుడ్ ఆడుతున్నాడు.