Published On:

Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఒక్కరోజులోనే 146 మంది మృతి

Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఒక్కరోజులోనే 146 మంది మృతి

Gaza: గాజాపై ఇజ్రాయెల్ దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా జరుపుతున్న దాడులతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు గాజాపై జరిగిన దాడుల్లో 146 మంది ప్రజలు మృతిచెందారు. అయితే కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఒప్పందం కుదిరినా దాడులు జరగడం విశేషం. తాజా దాడుల్లో 459 మంది పౌరులు గాయపడినట్టు గాజా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ మధ్య కాలంలో జరిగిన అతిపెద్ద దాడిగా దీనిని అధికారులు వర్ణిస్తున్నారు.

 

కాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ మంత్రివర్గం గాజా స్ట్రిప్ ను స్వాధీనం చేసుకోవాలని, సహాయాన్ని నియంత్రించాలని తీర్మానించినట్టు సమాచారం. హమాస్ పై తీవ్రమైన దాడిని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోందన్నారు. అందుకు అనుగుణంగా గాజాపై భారీగా దాడులు చేస్తోంది. కాగా గత నాలుగు రోజులుగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 190 మందికిపైగా పౌరులు చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.