Published On:

Israel: గాజాపై భీకర దాడులు.. 85 మంది మృతి

Israel: గాజాపై భీకర దాడులు.. 85 మంది మృతి

Gaza: గాజా నగరంపై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. అయినా ఇజ్రాయెల్ దాడులు ఆపడం లేదు. తాజాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు గాజాపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కాగా ఘటనలో 85 మంది గాజా పౌరులు చనిపోయినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర గాజాలోని రెండు చోట్ల తాజాగా దాడులు జరిగినట్టు సమాచారం. నిరాశ్రయులకు ఆశ్రయం ఇస్తున్న ఓ స్కూల్ పై కూడా దాడులు జరిగి 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

కాగా చనిపోయినవారిలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మధ్య గాజాలోని డీర్ అల్- బలాహ్ సిటీలో దాడులు జరిగాయి. కాగా కాల్పుల విరమణ ఒప్పందం ముగియడంతోనే గాజాపై తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగితేనే దాడులు ఆపుతామని చెప్తోంది. అయితే హమాస్ ను పూర్తిగా అంతం చేసి గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది. కాగా ఇప్పటివరకు జరిగిన దాడుల్లో దాదాపు 500 మందికిపైగా పౌరులు చనిపోయినట్టు గాజా అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేశాయి. దాడులు ఆపాలని కెనడా, యూకే, ఫ్రాన్స్ దేశాలు ఇజ్రాయెల్ ను కోరుతున్నాయి.