Gaza : గాజా మానవతా సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ దాడులు.. 30 మంది దుర్మరణం

Israeli attacks on Gaza : గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. తాజగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులు చేసింది. ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు.
అధికారుల వివరాల ప్రకారం.. రఫాలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మానవతా సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో దాడులు జరిగాయి. ఈ ఘటన సమయంలో వేలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం తీసుకోవడానికి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులు జరపగా, 30 మంది దుర్మరణం చెందారు. 115 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై హమాస్ స్పందించింది. మానవతా సాయం అందించే పేరుతో ఆకలితో అలమటిస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు సామూహిక హత్యలకు పాల్పడ్డాయని ఆరోపించింది. దీనిపై టెల్అవీవ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిన కొద్ది గంటల్లోనే దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్-హమాస్ల మధ్య జరుగుతున్న పోరులో గాజాలో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం అనుమతి ఇచ్చింది. అయితే, ఇది అక్కడి ప్రపలకు ఏమాత్రం సరిపోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి ఇజ్రాయెల్ ఇప్పటికే అంగీకరించింది. హమాస్ కూడా ఒప్పుకుంది. కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని సవరణలను మాత్ర సూచించింది.