Israel: గాజాపై ఆగని దాడులు.. మరో 64 మంది మృతి

Gaza: గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వరుసగా మూడో రోజు దాడులకు పాల్పడింది. కాగా గురువారం రాత్రి జరిపిన దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.
ముఖ్యంగా డీర్ అల్ బాలా, ఖాన్ యూనిస్ నగరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దాడుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. వీరిలో 48 మంది మృతదేహాలను ఇండోనేషియా ఆస్పత్రికి తరలించామని, మిగిలిన 16 మృతదేహాలను నాజర్ ఆస్పత్రికి పంపామన్నారు. వందలాదిగా ప్రజలు గాయాపడ్డారని అధికారులు చెప్పారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా టూర్ లో ఉండగానే ఈ దాడులు జరగడం విశేషం. కాగా గత బుధవారం రాత్రి జరిపిన దాడుల్లో 54 మంది, మంగళవారం రాత్రి జరిపిన దాడుల్లో 70 మంది చనిపోయారు. దీంతో మూడురోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినవారి సంఖ్య 188కి చేరింది. కాగా కొద్దిరోజుల క్రితమే అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్- హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. కానీ ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయడం విశేషం.