Last Updated:

Brazil: వరదలు, కొండచరియలు విరిగిపడటంతో బ్రెజిల్‌లో 36 మంది మృతి

బ్రెజిల్‌లో కుండపోత వర్షం కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 36 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు  తెలిపారు

Brazil: వరదలు, కొండచరియలు విరిగిపడటంతో బ్రెజిల్‌లో 36 మంది మృతి

 Brazil: బ్రెజిల్‌లో కుండపోత వర్షం కారణంగా వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 36 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు  తెలిపారు.సావో సెబాస్టియావో పట్టణం నుండి టీవీ మరియు సోషల్ మీడియా ఫుటేజీలు వరదలతో నిండిన రహదారులు మరియు కార్లు పడిపోయిన చెట్లను చూపించాయి.

ఐదు పట్టణాల్లో అత్యవసర పరిస్థితి..( Brazil)

మృతుల సంఖ్య పెరిగే అవకశముందని అని రాష్ట్ర సివిల్ డిఫెన్స్ చీఫ్ హెంగ్వెల్ పెరీరా వార్తాపత్రిక ఫోల్హా డి సావో పాలోతో అన్నారు.సావో పాలో నగరానికి ఉత్తరాన ఉన్న తీర ప్రాంతంలో మరో 228 మంది నిరాశ్రయులవగా, 338 మందిని ఖాళీ చేయించారు.తుఫాను బారిన పడిన వారికి సహాయం చేయడానికి రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు.సావో పాలో రాష్ట్ర గవర్నర్ టార్సిసియో డి ఫ్రీటాస్ వాతావరణం కారణంగా దెబ్బతిన్న తీరం వెంబడి ఉన్న ఐదు పట్టణాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అతను రెస్క్యూ ఆపరేషన్ల కోసం $1.5 మిలియన్ల సొమ్మును విడుదల చేసారు.అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా సోమవారం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని ట్విట్టర్‌లో తెలిపారు.

ఒక్కరోజులో 600 మిల్లీమీటర్లు వర్షపాతం.. ( Brazil)

 

సావో పాలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో ఈ ప్రాంతంలో ఒక్కరోజులో 600 మిల్లీమీటర్లు (23.6 అంగుళాలు) కురిసిందని, బ్రెజిల్‌లో ఇంత తక్కువ వ్యవధిలో ఎన్నడూ లేనంత ఎక్కువ మొత్తంలో ఇది ఒకటి.గవర్నర్ టార్సిసియో డి ఫ్రీటాస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ ప్రాంతానికి రెండు విమానాలు మరియు రెస్క్యూ బృందాలను పంపిన సైన్యం నుండి మద్దతును అభ్యర్థించాడు.టీవీ ఫుటేజీలో ఇళ్లు ముంపునకు గురై పైకప్పు మాత్రమే కనిపించాయి. నివాసితులు వస్తువులను మరియు ప్రజలను తీసుకెళ్లడానికి చిన్న పడవలను ఉపయోగిస్తున్నారు. రియో డి జెనీరోను ఓడరేవు నగరమైన శాంటోస్‌కి కలిపే రహదారి కొండచరియలు మరియు వరదల కారణంగా మూసుకుపోయింది.

రంగంలోకి దిగిన సైన్యం..

సావో సెబాస్టియావో, సావో పాలోకు ఉత్తరాన 200 కిలోమీటర్లు (120 మైళ్ళు) మరియు 24లో రికార్డు స్థాయిలో 60 సెంటీమీటర్ల (దాదాపు రెండు అడుగులు) వర్షం కురిసింది.ఇది సాధారణంగా నెలలో వచ్చే మొత్తం కంటే రెండింతలు ఎక్కువ.సావో సెబాస్టియావో మరియు ఇతర చోట్ల కార్నివాల్ ఈవెంట్లు  రద్దు చేయబడ్డాయి.హెలికాప్టర్ల సాయంతో 100 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో పని చేస్తున్నారు. కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సైనికులు కూడా రంగంలోకి దిగారు.

 

ప్రభుత్వం గాయపడిన వారిని , తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి మరియు రోడ్లు, శక్తి మరియు టెలికమ్యూనికేషన్‌లను పునరుద్ధరించడానికి” పని చేస్తుందని లులా చెప్పారు.వాతావరణ మార్పుల కారణంగా తుఫానులుబ్రెజిల్ కు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. పెట్రోపోలిస్ నగరంలో గత ఏడాది కుండపోత వర్షాలకు 230 మందికి పైగా మరణించారు.సావో సెబాస్టియావో, ఉబాటుబా, ఇల్హబెలా మరియు బెర్టియోగా నగరాలు, బాగా దెబ్బతిన్నాయి. ఇవి సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. రెస్క్యూ టీమ్‌లు శిథిలాల మధ్య తప్పిపోయిన, గాయపడినవారిని వెతికితీసే పనిలో ఉన్నాయి.