DOST: దోస్త్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్.. కామర్స్ కు ఫుల్ డిమాండ్

Telangana: తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గాను దోస్త్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ ప్రక్రియ పూర్తయింది. ఫస్ట్ ఫేజ్ లో 89,572 మంది విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 60,436 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. ఈ మేరకు దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కోటాయింపుపై ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి వివరాలు తెలిపారు. అయితే ఈసారి డిగ్రీలో కామర్స్ కోర్సుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపినట్టు తెలుస్తోంది.
కామర్స్ కోర్స్ కోసం 21758 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. అలాగే ఈ ఏడాది 58575 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం తీసుకున్నారు. అలాగే 1552 మంది విద్యార్థులు తెలుగు మీడియంను ఎంచుకున్నారు. డిగ్రీలో 309 మంది విద్యార్థులు ఉర్దూ మీడియంను తీసుకోగా… హిందీలో ఎవరూ జాయిన్ అవలేదు. అయితే దోస్త్ మొదటి ఫేజ్ లో రాష్ట్రవ్యాప్తంగా 74 కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు. ఇందులో 73 ప్రైవేట్ కాలేజీలు ఉండగా.. ఎల్లారెడ్డిపేటలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో దోస్త్ ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్స్ లో ఒక్క విద్యార్థి కూడా జాయిన్ అవలేదు.
మరోవైపు నేటి నుంచి దోస్త్ సెకండ్ ఫేజ్ అడ్మిషన్ ప్రాసెస్ ప్రారంభం కానుంది. జూన్ 9 వరకు దోస్త్ సెకండ్ ఫేజ్ దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 13న సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుందని ఉన్నత విద్యా మండలి పేర్కొంది.