Dil Raju: గద్దర్ అవార్డుల వేడుక.. సీని పరిశ్రమ తీరుపై దిల్ రాజు అసంతృప్తి!

Dil Raju Reacts on Gaddar Awards Event Success: గద్దర్ అవార్డుల వేడుకలపై నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) ఛైర్మన్ దిల్ రాజు స్పందించారు. ఆదివారం వీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు నిర్వహించే సినిమా అవార్డుల వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు సూచించారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్లోని హైటెక్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు పలువురు సినీ, రాజకీయల ప్రముఖులు హాజరయ్యారు. టీఎప్డీసీ ఛైర్మన్గా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను దిల్ రాజు దగ్గరుండి మరి చూసుకున్నారు. ఈ అవార్డుల వేడుక సక్సెస్ అయినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. “గద్దర్ అవార్డుల వేడుకను నిన్న భారీ ఎత్తున నిర్వహించాం. ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
ఆరు నెలలుగా వర్క్ చేశాం. ఈ కార్యాక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ముఖ్యమంత్రి గారికి బిగ్ బిగ్ థ్యాంక్స్. త్వరలోనే ఏపీలో కూడా అవార్డులు ప్రకటించనున్నారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తుంటే స్వీకరించే వాళ్లు ఎన్ని పనులున్నా వాటిని పక్కన పెట్టి సీక్వరించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంత పెద్ద ఈవెంట్లో ఏవైనా పొరాపట్లు జరిగితే క్షమించాలని కోరారు. ” అని పేర్కొన్నారు. కాగా అలాగే ప్రభుత్వ అవార్డులు స్వీకరణలో సీని పరిశ్రమ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
“తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు కోసం ఆరు నెలలుగా కష్టపడితే సక్సెస్ అయ్యింది. ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే అందరు హాజరై తీసుకోవాలి. ఈ పురస్కారాలకు సంబంధించిన కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. ముందుకుగా 2024 చిత్రాలకే అవార్డులు ఇవ్వాలన్నది ప్లాన్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిన ఏడాది నుంచే ఇస్తే బాటుందని పలువురు సూచించారు. ఈ మేరకు ఓ కమిటీ ఏర్పాటైంది. 2014 నుంచి 2023 వరకు ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి అవార్డులు ఇచ్చారు. గ్రహీతలకు సిల్వర్ మొమెంటో, ప్రశంసా పత్రంతో పాటు రూ. 5 లక్షలు మొత్తాన్ని అంజేశాం” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- Ye Maya Chesave Re-Release: మళ్లీ వెండితెరపై అలరించబోతున్న చై, సామ్.. ‘ఏమాయ చేశావే’ రీ రిలీజ్, ఎప్పుడంటే..?