Published On:

shahid Afridi: టపాసులు పేల్చినా మమ్ముల్నే అంటున్నారు.. షాహిద్ అఫ్రిది కామెంట్స్

shahid Afridi: టపాసులు పేల్చినా మమ్ముల్నే అంటున్నారు.. షాహిద్ అఫ్రిది కామెంట్స్

shahid Afridi sensational comments on indian army: జమ్ముకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఎప్రిల్ 22న పర్యాటకులపై లష్కరే తోయిబా ముష్కరులు కాల్పులు 26 మందిని హతమార్చిన విషయం తెలిసిందే. దాడికి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ గట్టిగా వాదిస్తోంది. పాకిస్తాన్ మట్టిలోనే ఉగ్రవాదం ఉందని ఆరోపిస్తోంది. పహల్గామ్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

 

అయితే ఇటీవల పహల్గామ్ లో జరిగిన దాడిలో పాకిస్తాన్ ను నిందించడంపై అక్కడి టీవీ ఛానళ్లలో ఇండియన్ ఆర్మీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 8 లక్షల సైనికులను కలిగిన భారత్ ఆర్మీ.. దాడి సమయంలో ఎం చేస్తోందని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి భారత్ ఎందుకు పనిరాదని, పౌరులకు రక్షణ కల్పించడంలో వారు విఫలమయ్యారని అన్నారు. భారత్ లో చిన్న టపాసులు పేల్చినా అది పాకిస్తాన్ పనే అంటూ నిందిచటం భారతీయులకు అలవాటైపోయిందన్నారు. కాగా అఫ్రిది కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

‘గతంలో కార్గిల్ యుద్ధంలో భారత్ ఆర్మీ మిమ్మల్ని ఓడించిన విషయం మరిచిపోయినట్టు ఉన్నారు. అయినా పాకిస్థాన్ కు ఇంకా బుద్ధి రాలేదు. ఇప్పటికైనా ఇలాంటి పనికిమాలిన పనులు, కామెంట్స్ ఆపి.. దేశాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కష్టపడండి. భారత్ ఆర్మీని చూసి నిజంగా గర్విస్తున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్’ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

 

కాగా పహల్గామ్ దాడుల ఘటన తర్వాత భారత్ కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు భారత్  ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అలాగే ఆదేశానికి భారత్ నుంచి ఒక్క చుక్క నీరు వెళ్లకుండా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలాగే జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేస్తోంది. భారత్ లో ఉంటున్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మెడికల్ వీసాలపై భారత్ లో ఉంటున్న వారికి ఇవాళ్టితో గడువు ముగియనుంది.

ఇవి కూడా చదవండి: