Floods: నైజీరియాలో వరద బీభత్సం.. 111 మంది మృతి

Nigeria: నైజీరియాలో భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. గురువారం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. పైగా డ్యామ్ కూలిపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. కాగా ఇప్పటివరకు 111 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
కాగా నైజీరియాను గత సెప్టెంబర్ లో కూడా వరదలు ముంచెత్తాయి. అప్పుడు కూడా ఆనకట్టలు తెగిపోవడంతో 30 మంది చనిపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికే బోకో హరామ్ తిరుగుబాటుతో మానవతా సంక్షోభం ఏర్పడగా.. వరదలతో పరిస్థితి మరింత దిగజారింది. నైజీరియాలో తరుచుగా వరదలు సంభవిస్తుంటాయి. వాతావరణ మార్పుల కారణంగా భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. తాజాగా వచ్చిన వర్షాలు కూడా భారీ నష్టాన్ని కలిగించాయి. కాగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలకు ఆహారం, నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు.