Akshay Kumar: ఫ్యాన్స్కి షాకిచ్చిన స్టార్ హీరో అక్షయ్ కుమార్ – రివ్యూ కోసం స్వయంగా రంగంలోకి.. గుర్తుపట్టని ఫ్యాన్స్

Akshay Kumar Trun Reporter For Housefull 5 Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్కి షాకిచ్చాడు. తన మూవీ రివ్యూ కోసం ఆయన రంగంలోకి దిగారు. ఇందుకోసం రిపోర్టర్ అవతారం ఎత్తి తన సినిమా టాక్ ఎలా ఉందో చెప్పాలంటూ ఆడియన్స్ వెనకాల పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య అక్షయ్ కుమార్ సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి.
ఈ క్రమంలో ఆయన హౌజ్ఫుల్ 5 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 6న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. దీంతో తన సినిమా టాక్ తెలుసుకునేందుకు అక్షయ్ రిపోర్టర్గా మారారు. మాస్క్ ధరించి థియేటర్ల ముందు మైక్ పట్టుకునే ఆడియన్స్ నుంచి రివ్యూ తీసుకుంటున్నారు. ఆయనను అవైయిడ్ చేస్తూ వెళ్లిపోతున్న ప్రేక్షకుల వెంటపడి మరి వారి నుంచి రివ్యూ తీసుకున్నారు. ఆయన మాస్క్ ధరించడంలో ప్రేక్షకులను ఆయనను గుర్తుపట్టలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
ఈ రోజు నేను కిల్లర్ మాస్క్ ధరించి బాంద్రాలో హౌజ్ఫుల్ 5 థియేటర్ నుంచి బయటకు వస్తున్న వారిని ఇంటర్య్వూలో చేశా. ఈ అనుభవం చాలా కొత్త ఉంది. అలాగే ఆడియన్స్ వస్తున్న రెస్పాన్స్కి ఆనందం కూడా ఉందని తన పోస్ట్లో రాసుకొచ్చారు. కాగా స్వయంగా అక్షయ్ జనాల మధ్యకు వచ్చిన ఆయనను గుర్తుపట్టకపోవడం సర్ప్రైజ్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ ఇలాంటివి అక్షయ్కి మాత్రమే సాధ్యమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా జూన్ 6న విడుదలైన హౌజ్ఫుల్ 5 మూవీ విడుదలైన తొలి రోజు భారీ ఒపెనింగ్స్ ఇచ్చింది. బాక్సాఫీసు వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్ దాటేసింది. ఫస్ట్ డే ఈ చిత్రానికి రూ. 24 కోట్లు రాగా.. రెండో రోజు అదే జోరు చూపించింది. సెకండ్ డే కూడా హౌజ్ఫుల్తో రూ. 30 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించగా.. రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఫర్దిన్ ఖాన్, నానా పటేకర్, షాకీ ష్రాఫ్లు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
View this post on Instagram