Gautam Gambhir: స్వామివారి సేవలో భారత క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్

Indian Head Coach Gautam Gambhir Visits Tirumala With Family: తిరుమల తిరుపతి శ్రీవారిని భారత్ హెడ్ కోచ్, భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయనకకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన గౌతమ్ గంభీర్ శనివారం రాత్రి ఆలయానికి చేరుకుని అక్కడే బస చేశారు. ఆయనతో పాటు భార్య నటాషా జైన్, కూతుళ్లు అజీన్, అనైజాలు ఉన్నారు.
వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఉదయం ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేదాశీర్వచనం చేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ఆ తర్వాత వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గంభీర్ ఆలయానికి వస్తున్న సమయంలో అభిమానులు ఫోటోలు దిగేందుకు గుమిగూడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ సిరీస్ భారత్ గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంతకుముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్ల్లో భారత్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గంభీర్పై ఒత్తిడి పెరుగుతోంది.