Home / TTD
TTD : తిరుమలలో ఈ నెల 15 నుంచి వీఐపీ సిఫారసు లేఖలు స్వీకరిస్తామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాణరెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై గురువారం నుంచి బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వరకు సిఫారసు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు గతంలో టీటీడీ ప్రకటించింది. ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని తెలిపింది. […]
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారిని ఒక్క క్షణమైనా చూసుకోని ఆనందించాలని సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ తిరుమల చేరుకుంటారు. తమ స్థోమతకు తగ్గట్టు స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మానవసేవే మాధవసేవ అనే విధంగా టీటీడీ భక్తులకు అనేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా వసతి, భోజన, దర్శన ఏర్పాట్లను చేస్తోంది. దీంతో భక్తుల నుంచి మన్ననలు అందుకుంటోంది. […]
TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం సమయాలను కూడా మార్చింది. ముఖ్యంగా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని సర్వదర్శనం సమయాన్ని పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మే1 నుంచి జూలై 15 వరకు కొత్త నిబంధనలను […]
Tirupati : టీటీడీ గోశాలకు గుంపులుగా రావొద్దని రాజకీయ పార్టీల నాయకులకు తిరుపతి పోలీసులు సూచించారు. కూటమి ప్రజాప్రతినిధులు, వైసీపీ మాజీ భూమన కరుణాకర్రెడ్డి సవాళ్ల నేపథ్యంలో పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతి ర్యాలీ పేరుతో భారీగా కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో గోశాలను సందర్శించవచ్చన్నారు. ఆ తర్వాత మీడియాతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా మాట్లాడి వెళ్లిపోవాలని నేతలకు పోలీసులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నేత భూమన […]
TTD ready to Take action on YCP Leader Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మృతిచెందాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన కరుణాకర్రెడ్డి తప్పుడు ఆరోపణలు […]
Vangalapudi Anitha Visits Tirumala Temple: తిరుపతిలోని తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు ఆమె వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు అనిత కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అదే విధంగా ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ […]
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో తిరుమల శ్రీవారి దర్శనాలు కల్పించడంపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెంకన్న దర్శనం ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం, మంగళవారం, రూ.300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాల్లో మాత్రమే స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఒక్కో […]
MP Raghunandan Rao : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనాకి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా.. టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకపోవడంపై మెదక్ […]
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం నుంచి భక్తులకు అదనంగా వడ ప్రసాదాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ముందుగా వడలను స్వామి, అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి చైర్మన్, అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ నాయుడు భక్తులకు స్వయంగా వడ్డించారు. వడలు రుచిగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. తాను టీడీపీ […]
TTD Calendars and Diaries: తిరుమల తిరుపతి దేవస్థానం 2025 సంవత్సరపు శ్రీవారి కేలండర్లు, డైరీలు రెడీ చేసింది. ఈ 12 పేజీలు, 6 పేజీలు, టేబుల్, టాప్, క్యాలెండర్లు, డైరీలు, చిన్న డైరీలను తిరుమల, తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్తో పాటు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబయి, వేలూరు, ఇతర ప్రధాన నగరాల్లోని కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో బుకింగ్ […]