BCCI : ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా.. మహిళల జట్టు వన్డే సిరీస్ షెడ్యూలు విడుదల
BCCI : స్వదేశంలో టీమ్ఇండియా మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టుతో సెప్టెంబర్లో 3 వన్డేలు జరగనున్నాయి. షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన ప్రారంభమయ్యే సిరీస్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ ఏడాది చివర్లలో మహిళల వన్డే ప్రపంచ కప్ జరగనున్నది. దాని కోసమే రెండు జట్ల సన్నాహాల్లో భాగంగా సిరీస్ నిర్వహించనున్నారు. మ్యాచ్లన్నీ చెన్నైలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
వన్డే సిరీస్ షెడ్యూలు..
మొదటి వన్డే : సెప్టెంబర్ 14
రెండో వన్డే : సెప్టెంబర్ 17
మూడో వన్డే : సెప్టెంబర్ 20
సిరీస్లో విజయం సాధించి వన్డే ప్రపంచ కప్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొనాలని టీమ్ఇండియా మహిళ జట్టు ఆకాంక్షిస్తోంది. 2007 నుంచి చెపాక్ స్టేడియం మహిళల వన్డే మ్యాచ్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ గ్రౌండ్లో మొదటగా భారత్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరిగింది. ఇటీవల మూడు టీ20 మ్యాచ్ల సిరీస్కు చెపాక్ స్టేడియం వేదికైంది. గతేడాది భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఒక టెస్టు మ్యాచ్ ఈ గ్రౌండ్లో జరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్లో భారత జట్టు చక్కటి ప్రదర్శనలు కనబరుస్తూ వస్తోంది. జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్ను చిత్తుగా ఓడించింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో ఫైనల్లో లంక జట్టును ఓడించి ట్రోఫీని ముద్దాడింది.