Last Updated:

Kerala Governor: 11 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కేరళ గవర్నర్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ 11 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనకు రాజీనామా లేఖలు పంపేందుకు నిరాకరించడంతో టూ తొమ్మిది యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్‌ గతంలో కోరారు.

Kerala Governor: 11 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కేరళ గవర్నర్

Kerala: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ 11 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనకు రాజీనామా లేఖలు పంపేందుకు నిరాకరించడంతో టూ తొమ్మిది యూనివర్సిటీల వైస్‌ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్‌ గతంలో కోరారు. సోమవారం ఉదయం 11.30 గంటలలోపు రాజీనామాలు సమర్పించేందుకు గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఉన్న గవర్నర్‌ స్వయంగా వెల్లడించారు.

తొమ్మిది యూనివర్సిటీలతో పాటు శ్రీ నారాయణ గురు ఓపెన్ యూనివర్సిటీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ డిజిటల్ సైన్సెస్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్‌లకు కూడా గవర్నర్ షోకాజ్ నోటీసు పంపారు. అయితే వీసీలు రాజీనామా చేయడానికి నిరాకరించడంతో, గవర్నర్ ఇప్పుడు వారికి అధికారిక నోటీసులు పంపారు. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన సెర్చ్ కమిటీ సిఫారసు మేరకు వైస్‌ఛాన్సలర్‌గా ఎలాంటి నియామకమైనా చెల్లుబాటయ్యేదని సుప్రీం కోర్టు తీర్పును సమర్థిస్తూ నోటీసులు జారీ చేసినట్లు ఖాన్ తెలిపారు. గవర్నర్ చర్య కేరళలో రాజకీయ కలకలం రేపింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తన అధికార పరిధిని అతిక్రమించవద్దని ఖాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. అధికార ఎల్‌డిఎఫ్ కూడా మంగళవారం నుంచి రెండు రోజుల రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రకటించింది.

వీసీలకు సహజ న్యాయం జరగలేదన్న సీఎం ఆరోపణలను ఖాన్ తోసిపుచ్చారు. “నేను గౌరవప్రదమైన మార్గాన్ని మాత్రమే సూచించాను. నేను వారిని బర్తరఫ్ చేయలేదు” అని తన పై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గవర్నర్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించేందుకే తాను ఇలా చేస్తున్నానని గవర్నర్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: