Last Updated:

Thief Returned jewels: శ్రీకృష్ణుడి ఆభరణాలను దొంగిలించిన దొంగ 9 ఏళ్ల తరువాత తిరిగి ఇచ్చేసాడు.. ఎందుకంటే..

ఒడిశాలోని గోపీనాథ్‌పూర్‌లోని గోపీనాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడి ఆభరణాలను దొంగిలించిన ఓ దొంగ 9 ఏళ్ల తర్వాత వాటిని తిరిగి ఇచ్చాడు. వీటిని దేవాలయం వద్ద వదిలిపెట్టిన దొంగ తన పేరును చెప్పకుండా ఒక లేఖ కూడా రాసాడు.

Thief Returned jewels:  శ్రీకృష్ణుడి ఆభరణాలను దొంగిలించిన దొంగ  9 ఏళ్ల తరువాత తిరిగి ఇచ్చేసాడు.. ఎందుకంటే..

Thief Returned jewels: ఒడిశాలోని గోపీనాథ్‌పూర్‌లోని గోపీనాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడి ఆభరణాలను దొంగిలించిన ఓ దొంగ 9 ఏళ్ల తర్వాత వాటిని తిరిగి ఇచ్చాడు. వీటిని దేవాలయం వద్ద వదిలిపెట్టిన దొంగ తన పేరును చెప్పకుండా ఒక లేఖ కూడా రాసాడు.

భగవద్గీత చదివి..(Thief Returned jewels)

2014లో, యజ్ఞశాలలో ఒక యజ్ఞం సందర్భంగా నేను వీటిని దొంగిలించాను. ఈ 9 సంవత్సరాలలో నేను చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. నేను వాటిని తిరిగి అప్పగిస్తున్నాను అంటూ తన లేఖలో పేర్కొన్నాడు. అతను దొంగిలించిన తలపాగా, చెవిపోగులు, కంకణాలు మరియు వేణువు ఉన్న బ్యాగ్ ఆభరణాలను ఆలయ ముఖ ద్వారం వద్ద వదిలి, పూజారి శ్రీ దేబేష్ చంద్ర మొహంతి గురించి ప్రస్తావించాడు. వీటితో పాటు అదనంగా మరో రూ.300 కూడా వదిలిపెట్టాడు. ఇటీవల భగవద్గీత చదివి తన తప్పును గ్రహించానని లేఖలో రాసాడు.ఇలా ఉండగా చోరీకి గురైన నగలు తిరిగి రావడంతో ఆలయ అధికారులు, భక్తుల్లో ఆనందం నెలకొంది. దొంగ పశ్చాత్తాపం చెందడం మరియు శ్రీకృష్ణుని బోధనల ప్రాముఖ్యతను గుర్తించడం భగవద్గీత యొక్క శక్తికి నిదర్శనమని వారంటున్నారు.

దొంగతనానికి వచ్చి నిద్రపోయాడు..

ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటనలో ఇద్దరు దొంగలు దొంగతనానికి వచ్చి చిత్తుగా తాగారు.వారిలో ఒకరు దొంగిలించిన సొత్తుతో పరారవగా మరొక దొంగ అక్కడే నిద్రపోయి దొరికిపోయాడు. లక్నోలో ఒక వివాహానికి హాజరుకావడానికి తమ ఇంటి నుండి బయటకు వెళ్లిన కుటుంబం వారి బెడ్‌రూమ్‌లో గాఢనిద్రలో ఉన్న వ్యక్తిని చూసి షాక్‌కు గురయ్యారు. అతని చుట్టూ మద్యం సీసాలు పడి ఉన్నాయి. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. 8 లక్షలకు పైగా విలువైన వస్తువులు మాయమైనట్లు కుటుంబీకులు గుర్తించారు.. ఆ వ్యక్తి నిద్ర లేచే వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూసి పోలీసులకు అప్పగించారు. పోలీసు విచారణలో ఆ వ్యక్తిని, అతని భాగస్వామి వదిలిపెట్టి వెళ్లిపోయాడని తేలింది.