Home / Odisha
ఎన్నికలు సమీపించే కొద్ది ఒడిషాలో లుంగీ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. రాష్ర్టంలో అసెంబ్లీతో పాటు లోకసభ ఎన్నికలు ఒకే సారి జరుగనున్నాయి. కాగా లుంగీ పాలిటిక్స్కు తెరతీసింది మాత్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒడిషాలో ప్రజలు లుంగీలు ధరించరు. లుంగీలు ధరిస్తే చులకనగా చూస్తారు.
శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు రూ.100 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్లోని సాహు నివాసాలపై ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.
AI News Anchor: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుందని చెప్పాలి. ప్రతి రంగంలోనూ ఏఐ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తున్నారు. తక్కువ కాలంలో ఆక్యురేట్ సమాచారాన్ని అందించండంలో ఏఐ తనదైన పాత్ర పోషిస్తుంది.
ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో టాటా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మేరమాండల్ ప్రాంతంలో టాటా స్టీల్ కు చెందిన ‘బ్లాస్ట్ ఫర్నేస్ పవర్ ప్లాంట్’లో ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తోంది.
బ్రేక్ ప్యాడ్లు రాపిడి కారణంగా పూరీ-దుర్గ్ ఎక్స్ప్రెస్ యొక్క ఏసీ కోచ్ లో మంటలు రేగాయని రైల్వే అధికారి తెలిపారు. దీనితో ఒడిశాలోని నువాపాడా జిల్లాలోని ఖరియార్ రోడ్ లో రైలు నిలిపివేసారు. రైలు గురువారం సాయంత్రం ఖరియార్ రోడ్ స్టేషన్కు చేరుకోగానే బి3 కోచ్లో పొగలు కనిపించాయని తెలిపారు
ఒడిశాలోని జాజ్పూర్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికులు మరణించారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని రైల్వే అధికారి తెలిపారు.భారీ వర్షం పడటంతో గూడ్స్ కిందకు చేరిన కూలీలు అది అకస్మాత్తుగా గాలులకు కదలడంతో దానికిందే ప్రాణాలు వదిలారు.
మంగళవారం సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్లోని ఒక ఏసీ కోచ్లోని ఏసీ యూనిట్ నుంచి పొగలు రావడంతో అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు, రైల్వే అధికారులు ఒడిశాలోని బ్రహ్మపూర్ స్టేషన్లో రైలును నిలిపివేసారు.
సోమవారం తెల్లవారుజామున ఒడిశాలోని డుంగురి నుంచి బార్గఢ్కు వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సున్నపురాయితో వెళ్తున్న గూడ్స్ రైలులోని అనేక వ్యాగన్లు బార్ఘర్ జిల్లా సంబర్ధరా సమీపంలో పట్టాలు తప్పాయి. ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని కనీసం 275 మంది ప్రాణాలు కోల్పోయిన మూడు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
ఒడిశాలోని బాలాసోర్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం సందర్బంగా రైలులోని పలు బోగీలు బోల్తా పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం బృందాలు బయలుదేరాయి.
: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో గంజాయి నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని ఒడిశా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. రాష్ట్రంలోని ఏ శివాలయంలోనూ గంజాయిని ఏ రూపంలోనూ ఉపయోగించరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.