Last Updated:

Amarnath Yatra: అమర్ నాథ్ కు యాత్ర వేళాయే.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం

హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర కోసం ఈ ఏడాది రిజిస్ట్రేషన్ లో కొత్త రూల్ ను తీసుకొచ్చారు.

Amarnath Yatra: అమర్ నాథ్ కు యాత్ర వేళాయే.. రిజిస్ట్రేషన్లు ప్రారంభం

Amarnath Yatra: జమ్మూ కశ్మీర్ లోని సుప్రసిద్ధమైన అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. దక్షిణ కశ్మీర్‌లోని ఈ యాత్ర ఈసారి జులై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు సాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు యాత్రికులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంది. అమర్‌నాథ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు బ్యాంకు శాఖల్లోనూ రిజిస్ట్రర్ అవ్వొచ్చు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన 316 శాఖల్లో అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని ఆ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ తెలిపారు. గతేడాది వరకు యాత్రికులకు మాన్యువల్‌గా ఫాంలు ఇచ్చారని.. ఇప్పుడు సిస్టమ్‌ జెనరేటెడ్‌ ఫాంలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనాలనుకొనే యాత్రికులు తమ ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను పొందుపర్చడం తప్పనసరి అన్నారు.

 

పూజలు ప్రత్యక్ష ప్రసారం(Amarnath Yatra)

మరోవైపు, జమ్మూలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ శాఖను పుష్పాలతో అందంగా ముస్తాబు చేశారు. ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్లు మొదలవ్వడంతో బ్యాంకుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు పేర్ల నమోదుకు చేసుకొనేందుకు వచ్చారు. ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర కూడా రెండు మార్గాల ద్వారా కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

 

Amarnath Yatra 2023: Registration for Amarnath Yatra will start from today,  know the fee and other details.. - Kalam Times

ఈ సారి కొత్త రూల్

హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర కోసం ఈ ఏడాది రిజిస్ట్రేషన్ లో కొత్త రూల్ ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే యాత్రికులు కచ్చితంగా ఆధార్ లో రిజిస్ట్రర్ చేయించి వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ యాత్ర సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అధికారులు జారీ చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య ధ్రువ పత్రాన్ని పొందుపర్చాలి. 6 వారాలకు పైబడిన గర్భిణీలు ఈ అమర్ నాథ్ యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు. అమర్ నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలి వెళ్తారు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.