Last Updated:

NIA Raids : గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాదం లింకుల కేసు.. దేశంలోని 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాదం లింకుల కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబ్‌లోని 20 ప్రదేశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాడులు నిర్వహిస్తోంది.

NIA Raids : గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాదం లింకుల కేసు.. దేశంలోని 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు

NIA Raids: గ్యాంగ్‌స్టర్-ఉగ్రవాదం లింకుల కేసులో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబ్‌లోని 20 ప్రదేశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాడులు నిర్వహిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్, నీరజ్ బవానా మరియు టిల్లు తాజ్‌పురియాతో సహా ఆరుగురు గ్యాంగ్‌స్టర్‌లను విచారించిన తర్వాత ఎన్ఐఏ ఈ దాడులు ప్రారంభించింది.

ఆరుగురు గ్యాంగ్‌స్టర్లను విచారించగా, పలువురు గ్యాంగ్‌స్టర్ల పేర్లు తెరపైకి వచ్చినట్లు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ల ఇళ్లపైనా, వారికి సంబంధించిన ఇతర ప్రాంతాలపైనా, వారి సహాయకులపైనా ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తోంది.గ్యాంగ్‌స్టర్లకు ఇతర దేశాల్లో పరిచయాలు ఉన్నాయని లారెన్స్‌ బిష్ణోయ్‌, బవానా గ్యాంగ్‌ పేరుతో భారత్‌లో ఉగ్రదాడులకు భారీగా నిధులు సమకూరుస్తున్నాయని తెలుస్తోంది.

ఇప్పటివరకు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద అరెస్టయిన గ్యాంగ్‌స్టర్లందరినీ విచారించిన అనంతరం పాకిస్థాన్-ఐఎస్‌ఐ, గ్యాంగ్‌స్టర్ బంధంపై ఎన్‌ఐఏ సమాచారాన్ని సేకరించిందని వారు తెలిపారు.దేశవ్యతిరేక కార్యకలాపాలకు గ్యాంగ్‌స్టర్లను ఏవిధంగా ఉపయోగించుకుంటున్నారనే దానిపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది.ఎన్ఐఏ వర్గాల సమాచారం ప్రకారం, గ్యాంగ్‌స్టర్- ఉగ్రవాదుల నిధుల కేసులో ఏజెన్సీ ఇప్పటివరకు రెండు రౌండ్ల దాడులు నిర్వహించింది. గతంలో ఎన్‌ఐఏ రెండు దఫాలుగా ఈ కేసులో 102 చోట్ల దాడులు చేసింది.

ఇవి కూడా చదవండి: