Corona : 24 గంటల్లో దేశంలో 117 కొత్త కేసులు నమోదు.. మూడు మరణాలు

Corona Virus : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 24 గంటల్లో 117 మందికి పాజిటివ్గా తేలింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 7,154 చేరాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం. కేరళలో అత్యధికంగా 2,165 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గుజరాత్లో 1,281 కేసులు, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615, కర్ణాటకలో 467, యూపీలో 231, ఉత్తరప్రదేశ్లో 227 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ఇద్దరు, మధ్యప్రదేశ్లో ఒకరు మృతిచెందారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 77కి చేరింది. ఇప్పటి వరకు 9,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు.