Published On:

Schools Re Open in Telangana: నేటి నుంచే సూళ్లు రీఓపెన్.. బడి బాట పట్టనున్న విద్యార్థులు!

Schools Re Open in Telangana: నేటి నుంచే సూళ్లు రీఓపెన్.. బడి బాట పట్టనున్న విద్యార్థులు!

Schools Re Open in Telangana: వేసవి సెలవులు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 61 లక్షలకు పైగా విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ఇవాళ్టి నుంచి స్కూళ్లు ప్రారంభంకానుండటంతో విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇక విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో సర్కార్లు, ప్రైవేట్ కలిపి మొత్తం 41,354 స్కూళ్లు ఉండగా, వాటిలో 61.99 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.

 

మరోవైపు 11 వేలకు పైగా ప్రైవేట్ స్కూళ్లు ఉండగా.. 36.87 లక్షల మంది స్టూడెంట్లు ఉన్నారు. మిగిలిన వారంతా గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నారు.. అయితే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు ఈనెల 6 నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక రాష్ట్రంలో ఈఏడాది కొత్తగా 210 ప్రైమరీ స్కూళ్లలో ప్రీప్రైమరీ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి రిలీజ్ చేశారు. మరోవైపు 5651 స్కూళ్లలో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.