Police Warn : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదలం.. పోలీస్ శాఖ హెచ్చరిక
Telangana Police issues strong warning to singer Mangli : చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో పోలీసులు దాడి చేశారు. రిసార్ట్లో ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత పెద్ద ఎత్తున డీజే శబ్దాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రిసార్ట్లో మెరుపు దాడి చేశారు. పుట్టిన రోజు వేడుకల్లో విదేశీ మద్యం పట్టుబడింది. గంజాయి తాగుతూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. మంగ్లీ తీరుపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీంతో ట్వీట్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.
పోలీసుల ట్వీట్..
అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న రిసార్ట్పై చేవెళ్ల పోలీసులు దాడి చేశారు. చట్టాలు పాటించకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తే పోలీసులు ఝులిపించి గాడినపెట్టాల్సి వస్తుందని పోలీస్ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ను వాడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ట్వీట్ చేసింది.
మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో గంజాయి కలకలం రేపింది. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్లో మంగళవారం రాత్రి ఆమె బర్త్ డే పార్టీని నిర్వహించారు. పుట్టిన రోజు వేడుకల్లో దివి, కాసర్ల శ్యామ్, జబర్దస్త్ రవి, సింగర్ ఇంద్రావతి పాల్గొన్నారు. పుట్టిన రోజు వేడుకల్లో పోలీసులు ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చారు. పార్టీలో విదేశీ లిక్కర్ ఏరులై పారింది. దామోదర్ అనే వ్యక్తి గంజాయి తీసుకుంటూ పట్టుబట్టాడు. ఎలాంటి అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించడంపై త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ శివరామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. డీజే, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న సెలబ్రెటీ దివి పోలీసులు చూస్తుండగా పారిపోయారు. పోలీసులపై సింగర్ మంగ్లీపై వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. పార్టీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా మంగ్లీ వారిపై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. వేడుకల్లో పాల్గొన్న కొంతమంది పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో మెల్లగా జారుకున్నట్లు సమాచారం.