Published On:

India: భారత్ ఢిపెన్స్ సిస్టమ్ గ్రేట్.. భారీగా పాకిస్తాన్ డ్రోన్ల కూల్చివేత

India: భారత్ ఢిపెన్స్ సిస్టమ్ గ్రేట్.. భారీగా పాకిస్తాన్ డ్రోన్ల కూల్చివేత

India- Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22న లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే పహల్గామ్ దాడులకు సమాధానంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో 100 మందికిపైగా జైషే మహ్మద్, లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు ప్రారంభించింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది.

 

అయితే పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. దాదాపు 600కు పైగా పాకిస్తానీ డ్రోన్లను కుప్పకూల్చాయి. ఈ మేరకు అంతర్జాతీయ సరిహద్దు వద్ద 1000 కంటే ఎక్కువ యాంటీ- ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ని భారత్ ఉపయోగించింది. వీటి ద్వారా పాకిస్తాన్ కు భారీ నష్టం జరిగింది. వైమానిక దాడుల్ని ఎదుర్కొనేందుకు సర్ఫేజ్ టూ ఎయిర్ క్షిపణి వ్యవస్థల్ని రంగంలోకి దించింది. స్వదేశీ టెక్నాలజీ తయారు చేయబడిన ఆకాష్ తిర్” గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసింది. దీంతో పాకిస్తాన్ లోని పలు సైనిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. కాగా పాకిస్తాన్ పై జరిపిన దాడుల వివరాలను భారత్ ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉంచింది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకున్నా.. చివరకి భారత్ జరిపిన దాడులతో తమకు నష్టం కలిగిందని పాకిస్తాన్ ఒప్పుకుంది.