Published On:

Singer Mangli: బర్త్‌డే పార్టీపై స్పందించిన సింగర్‌ మంగ్లీ

Singer Mangli: బర్త్‌డే పార్టీపై స్పందించిన సింగర్‌ మంగ్లీ

Singer Mangli First Reaction Birthday Party: సింగర్‌ మంగ్లీ పుట్టినరోజు వేడుక రచ్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లిలోని త్రిపుర రిస్టార్ట్‌లో మంగళవారం రాత్రి మంగ్లీ పుట్టిన రోజు వేడుకను నిర్వహించారు. ఈ పార్టీలో డ్రగ్స్‌, ఫారీన్‌ లిక్కర్‌ వినియోగించారని వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అనుమతి లేకుండ పార్టీ నిర్వహించడం, మద్యం వినియోగానికి ఎక్స్‌సైజ్‌ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని తేలడంతో మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

దీంతో ఈ వ్యవహరంలో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ వివాదంపై సింగర్‌ మంగ్లీ స్పందించింది. ఈ మేరకు ఆమె వీడియో షేర్‌ చేసింది. ‘నా తల్లిదండ్రుల కోరిక మేరకే పుట్టిన రోజును జరుపుకున్నాను. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా జరుపుకుందామని రిసార్ట్‌ బుక్‌ చేసుకున్నాం. అనుమతి లేకుండ పార్టీ నిర్వహించిన మాటే నిజమే. ఇలాంటి వాటిపై నాకు ఎలాంటి అవగాహన లేదు. అందుకే అవన్ని తెలియదు నాకు.

 

అంతేకాని ఈ పార్టీలో గంజాయి, మద్యం ఉపయోగించలేదు. సోషల్‌ మీడియాలో అంత తప్పుతప్పుగా రాస్తున్నారు.  నా తల్లిదండ్రులను పక్కన పెట్టుకుని అలాంటి పనులు చేస్తానా. డ్రగ్స్‌ పాజిటివ్ వచ్చిన వ్యక్తి బయట తీసుకొని వచ్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తాము. దయచేసి నాపై అసత్య ప్రచారాలు చెయ్యొద్దు’ అని చెప్పకొచ్చింది. కాగా పోలీసులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ ఇలా మీడియాతో మాట్లాడారు.

 

‘మంగళవారం రాత్రి 10 గంల సమయంలో పార్టీ మొదలైంది. త్రిపుర రిస్టార్ట్‌ నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయని మా ఎస్‌వోటీ పోలీసులకు సమాచారం వచ్చింది. అక్కడ మద్యం వినియోగిస్తున్నారని కూడా తెలిసింది. దాంతో రాత్రి 12 గంటల సమయంలో మా పోలీసులు రిసార్ట్‌కు వెళ్లారు. అప్పుడు 10 మంది స్త్రీలు, 12 మంది పురుషులు ఉన్నారు. పార్టీలో ఉన్నవారందరికి డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించాము. ఒక్కరికే మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. అక్కడ రావడానికి ముందే బయట ఎక్కడో అతడు గంజాయి తీసుకున్నాడు’ తెలిపారు. అయితే పార్టీలో దాడులు చేయగా.. అక్కడ ఎలాంటి విదేశీ మద్యం కానీ, మత్త పదార్థాలు లభించలేదని చేవెళ్ల ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌ శ్రీధర్‌ చెప్పారు.