Published On:

Central cabinet : తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. రెండు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Central cabinet : తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. రెండు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Union Minister Ashwini Vaishnav : తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రెండు కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రెండు ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్, కర్ణాటక, ఏపీలోని ఏడు జిల్లాలను కవర్ చేసే రైల్వేలైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వేలైన్ డబ్లింగ్‌కు రూ.6,405 కోట్లు అని తెలిపారు.

 

కేంద్రం ఆమోదించిన వాటిలో బళ్లారి-చిక్ బజూర్ రైల్వేలైన్ డబ్లింక్ ఒకటి. రూ.3,342 కోట్లతో 185 కిలోమీటర్ల లైన్‌ను డబ్లింగ్ చేయబోతున్నది. మంగళూరు పోర్టును సికింద్రాబాద్‌తో అనుసంధానానికి మార్గం సుగమం కానుంది. కర్ణాటకలోని బళ్లారి, చత్రదుర్గ, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం మీదుగా డబ్లింగ్ లైన్ ఉండనుంది. డబ్లింగ్ లైన్‌తో వాణిజ్య రవాణా మరింతగా పెరగనుంది. కేబినెట్ ఆమోదించిన మరో లైన్ కోడెర్మా-బర్కకానా–ట్రాక్ డబ్లింగ్. 133 కి.మీ పొడవుతో జార్ఖండ్‌లోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతం గుండా వెళ్తుంది. కాగా పాట్నా, రాంచీ మధ్య సమర్థవంతమైన రైలు లింక్‌గా నిలవబోతుంది.

 

కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. మోదీ సర్కారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఐఐఎం బెంగళూరు, ఐఐఎస్ కలకత్తా ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం రవాణాలో పెట్టుబడులు దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులో సుమారు 4 శాతం తగ్గింపుకు కారణమయ్యాయని స్పష్టం చేసినట్లు తెలిపారు. గతేడాదిలో రవాణా ప్రాజెక్టుల కోసం సుమారు రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించినట్లు తెలిపారు. ఇది తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో పెద్దపాత్ర పోషిస్తుందని కేంద్ర మంత్రి వివరించారు.

ఇవి కూడా చదవండి: