Deputy CM Bhatti Vikramarka: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. రూ.కోటి బీమా!
Deputy CM Bhatti Vikramarka good news to Electricity Department Employees: విద్యుత్ శాఖ ఉద్యోగులకు టీఎస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ప్రమాదబీమా అందించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎస్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఈ అగ్రిమెంట్ జరిగింది.
ఈ పథకం కింద విద్యుత్ శాఖలో ఉద్యోగులకు రూ. కోటి వరకు ప్రమాద బీమా ఇవ్వనుంది. రూ.కోటి ఇన్సూరెన్స్తో ఉద్యోగుల్లో ధైర్యంతో పాటు నమ్మకం పెరుగుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకం దేశంలోనే తొలి పథకంగా వెల్లడించారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని తీసుకురాలేదన్నారు. ఈ మేరకు డిమాండ్ ఆధారంగా విద్యుత్ ప్రొడక్షన్ ను పెంచాలని ఉద్యోగులకు సూచించారు.