IPL2025: చెన్నై ఆలౌట్.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?

CSK Vs PBKS: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన చెన్నై చాహల్ ధాటికి జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై జట్టులో సామ్ కరన్ (88) రాణించాడు. సిక్సర్లు, బౌండరీలతో పంజాబ్ బౌలర్లను ఆడుకున్నాడు. కానీ సామ్ కరన్ ఔటైన తర్వాత చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రేవిస్ (32), జడేజా (17) పరుగులు చేశారు.
పంజాబ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చౌహల్ హ్యాట్రిక్ తో సత్తా చాటాడు. ఓకే ఓవర్లలో 4 వికెట్లు తీసి చెన్నై జట్టును గట్టి దెబ్బ తీశాడు. దీంతో స్టేడియంలోనే పంజాబ్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. అర్ష్ దీప్ సింగ్, జాన్సెన్ చెరో రెండు విక్లెట్లు, ఒమర్జాయ్, బ్రార్ లు చెరో వికెట్ తీశారు.