Published On:

PKBS Target 185: పంజాబ్ టార్గెట్ 185, హాఫ్ సెంచరీ చేసిన సూర్య కుమార్ యాదవ్

PKBS Target 185: పంజాబ్ టార్గెట్ 185, హాఫ్ సెంచరీ చేసిన సూర్య కుమార్ యాదవ్

PKBS Target is 185 against MI: 2025ఐపీఎల్ సీజన్ చివరికొచ్చింది. మొత్తం 74 మ్యాచులకు ఈరోజు 69వ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో పంజాబ్ తో ముంబై తలపడుతుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ బంతులతో నిప్పులు కురిపించింది. దీంతో నిర్ణిత 20 ఓవర్లకు గాను ముంబై 184 పరుగులు చేసింది. దుకుడుగా ఓపెనింగ్ చేసిన ముంబై ఓపెనర్లు తొందరగానే పెవిలియన్ చేరారు. రోహిత్ శర్మ 21 బంతుల్లో 24 పరుగులు, ర్యాన్ 20 బంతుల్లో 27 పరుగులు చేసి నిష్క్రమించారు.

 

ఫస్ట్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. 39 బంతుల్లో 57 పరుగులు చేసి బ్యాట్ తో అభివాదం చేశాడు. సెకండ్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ 4 బంతుల్లో 1 పరుగు, థర్డ్ డౌన్ లో వచ్చిన విల్ జాక్స్ 8బంతుల్లో 17పరుగులు చేశారు. ఇక లేటుగా క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 15బంతుల్లో 26పరుగులు చేశాడు. నమన్ ధీర్ 12బంతుల్లో 20 పరుగులు మిచెల్ 1బంతుల్లో 1పరుగు చేశాడు. దీంతో నిర్ణిత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 184పరుగులు చేసింది.

 

పంజాబ్ బౌలర్లలో అర్శదీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. హర్ ప్రీత్ బ్రార్ ఒక వికెట్ తీశాడు. అర్శదీప్ చివరి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ కు దగ్గరవడంతో టీంలు పట్టుబిగిస్తున్నాయి.

 

ర్యాన్ 27 (20), రోహిత్ 24 (21), సూర్యకుమార్ యాదవ్ 57 (39), తిలక్ వర్మ 1 (4), విల్ జాక్స్ 17 (8), హార్దిక్ పాండ్యా 26 (15), నమన్ ధార్ 20 (12), మిచెల్ 1(1).

ఇవి కూడా చదవండి: