PBKS Beats MI: ముంబైకి ఝలక్.. టాప్ లోకి పంజాబ్

Punjab beats Mumbai with 7 Wickets: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిన్న జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-1 కు దూసుకెళ్లింది. తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ జట్టు.. తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించింది. జోస్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులతో రాణించగా.. యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 35 బంతుల్లో 62 సహకారంతో పంజాబ్ లక్ష్యాన్ని చేరుకుంది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 187 పరుగులతో టార్గెట్ రీచ్ అయింది.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అంతగా రాణించలేదు. ఓపెనర్లు రికెట్ టన్, రోహిత్ శర్మ పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డారు. తొలి వికెట్ కు వీరిద్దరూ కలిసి 45 పరుగులు జోడించారు. పవర్ ప్లే ముగిసేవరకు ముంబై వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. తర్వాత సూర్య, రోహిత్ ముంబై జట్టును నడిపించారు. పరుగులు రాబట్టడంలో వేగం తగ్గింది. చివరికి రోహిత్ శర్మ 21 బంతుల్లో 24 పరుగుల చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో 57 హాఫ్ సెంచరీతో ముంబైని ఆదుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన విల్ జాక్స్ ఫోర్, సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించినా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు. చివర్లో నమన్ ధీర్ వేగంగా పరుగులు రాబట్టడంతో ముంబై 184 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్, విజయ్ కుమార్ వైశుక్, అర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. హరిప్రీత్ బ్రార్ కు వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ వచ్చిన పంజాబ్ కు కూడా మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 13 రన్స్ చేసి 34 పరుగుల వద్ద ఔటయ్యాడు. ముంబై బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. ఈ దరశలో బ్యాటింగ్ కు వచ్చిన జోస్ ఇంగ్లిస్, ప్రియాంష్ ఆర్య పంజాబ్ జట్టును ఆదుకున్నారు. పరుగులు వరద పారించడంతో 10 ఓవర్లు పూర్తయే సమయానికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. 12 ఓవర్లో ఇంగ్లిస్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెండో వికెట్ వీరిద్దరూ కలిసి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఎట్టకేలకు 15 ఓవర్లో సాంట్నర్ జోడీని విడగొట్టారు. 62 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆర్య ఔటయ్యాడు. అనంతరం ఇంగ్లిస్ వెనుతిరిగినా.. శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ముంబై బౌలర్లోలో బుమ్రా సాంటర్న్ తలో వికెట్ పడగొట్టారు.