Published On:

Bhubaneswar : విజిలెన్స్ అధికారుల తనిఖీ.. చీఫ్‌ ఇంజినీర్ ఇంట్లో కరెన్సీ కట్టలు

Bhubaneswar : విజిలెన్స్ అధికారుల తనిఖీ.. చీఫ్‌ ఇంజినీర్ ఇంట్లో కరెన్సీ కట్టలు

Chief Engineer : చీఫ్‌ ఇంజినీర్ ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. అతడు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు రావడంతో అధికారి కంగుతిన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక నోట్ల కట్టలను కిటికీ నుంచి బయటకు విసిరాడు. కరెన్సీ నోట్ల వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ ఘటన జరిగింది.

 

ఒడిశా రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో వైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అతడు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో విజిలెన్స్ అధికారులు 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తన బాగోతం బయటపడకూడదనుకున్న ఉద్యోగి డబ్బులు అధికారుల కంట పడకూడదని తన ఫ్లాట్ కిటికీ నుంచి బయటకు విసిరాడు. సాక్షుల సమక్షంలో నగదును అధికారులు రికవరీ చేశారు. రూ.2 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చెందిన మొత్తం 7 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో 26 మంది అధికారులు పాల్గొన్నారు. అధికారులు నోట్ల కట్టలు లెక్క పెడుతోన్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఇవి కూడా చదవండి: