Home / India Pakistan Ceasefire
India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత ఆర్మీ దళాలు జరిపిన దాడులను త్రివిధ దళాల డీజీఎంఓలు వెల్లడించారు. దాడుల్లో పాక్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని అధికారులు తెలిపారు. సుమారు 100 మంది ముష్కరులు హతమయ్యారని స్పష్టం చేశారు. కాగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ నామరూపాలు లేకుండా చేశామని అన్నారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లతో […]
Defence Minister Rajnath Singh Key Statements on Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. భారత్ శక్తి ఏంటో మరోసారి నిరూపించామని తెలిపారు. ఇందులో పాక్ ప్రజలను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదని, కానీ భారత్ ప్రజలపై పాక్ దాడి చేసిందని వెల్లడించారు. అయితే పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. లోపలికి చొచ్చుకొని వెళ్లి అనేక దాడులు […]
India and Pakistan meeting in hotline about Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్)లు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గించడం ప్రధాన అంశాలు. శనివారం మధ్యాహ్నం 3:35కు ఇరు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకొని, […]
Operation Sindoor 2.0 Will continues.. said By Indian Airforce: పాకిస్థాన్ దుశ్చర్యకు భారత్ సీరియస్ అయింది. ఆపరేషన్ సింధూర్ 2.0 కొనసాగిస్తామని ప్రకటించింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ది చెబుతామన్నారు. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ దాడులు చేయడంతో.. కాల్పుల ఉల్లంఘనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించేది లేదని.. పాక్ తన వక్రబుద్ధిని మానుకోవాలని హితవు పలికింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందపై కేంద్రం స్పందించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు […]
India Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్, పంజాబ్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాక్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా […]
EX PM Indira Gandhi Era during India Pakistan War: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మరికొందరు నేతలు ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇండియా-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్ […]
India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తిత్వం తొలిసారేమి కాదు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య చాలా సందర్భంలోనూ మూడో పక్షాలు మధ్యవర్తిత్వం వహించి సంధి కుదిరించాయి. 1966లో సోవియట్ యూన్యన్.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య 1965లో యుద్ధం జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుత (ఉజ్బెకిస్థాన్లోని) తాష్కెంట్లో శాంతి ఒప్పందం జరిగింది. సోవియట్ యూనియన్ ప్రధాని అలెక్సీ కొసిగిన్ ఆధ్వర్యంలో భారతదేశం ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు […]
India Pakistan Ceasefire Violation: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది. ఒక పైపు సంధి అంటూనే మరోవైపు కాల్పులకు తెగబడింది. ప్రధానికి తెలియకుండానే పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 8గంటల 39 నిముషాలకుపాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ట్వీట్ చేసిన నిముషాల వ్యవధిలోనే పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. ట్రంప్, జెడి వాన్స్, మార్కో రుబియోలకు పాక్ ప్రధాని తన ఎక్స్ ఖాతాలో ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల […]