Published On:

Drone Attack : ఉక్రెయిన్ బ‌స్సుపై అటాక్.. 9 మంది దుర్మరణం

Drone Attack : ఉక్రెయిన్ బ‌స్సుపై అటాక్.. 9 మంది దుర్మరణం

Attack on Ukrainian minibus : ర‌ష్యా డ్రోన్ దాడిలో 9 మంది సాధార‌ణ పౌరులు దుర్మరణం చెందారు. ఉక్రెయిన్‌కు చెందిన మినీ బ‌స్సుపై అటాక్ జ‌రిగింది. ర‌ష్యా బోర్డ‌ర్‌కు స‌మీపంలో ఉన్న బిలోపిలియా ప‌ట్ట‌ణంలో బ‌స్సుపై దాడి చేశారు. ప్ర‌మాదంలో 7 మంది గాయ‌ప‌డ్డారు. దాదాపు మూడేళ్ల త‌ర్వాత ర‌ష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు శాంతి చ‌ర్చిల్లో పాల్గొంటున్నాయి. యుద్ధ ఖైదీల అప్ప‌గింత‌పై చర్చలో ఒప్పందం కుదిరిన‌ట్లు తెలుస్తోంది.

 

కావాలనే ఈ దుశ్చర్య..
కావాల‌నే సాధార‌ణ పౌరులను చంపుతున్న‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ర‌ష్యాకు చెందిన లాన్సెట్ డ్రోన్‌ బ‌స్సుపై అటాక్ చేసిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణలో వెల్ల‌డైంది. ఈ అటాక్ అమాన‌వీయమ‌న్నారు. ప్ర‌స్తుతం ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య కుదిరిన ఒప్పందం ప్ర‌కారం 1000 మంది ఖైదీల‌ను అప్ప‌గించుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా త‌మ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ జ‌ర‌గ‌వ‌చ్చని తెలిపారు. ఆఫ‌ర్‌ను ఉక్రెయిన్ ఎప్ప‌టి నుంచి ప్ర‌క‌టిస్తోంద‌న్నారు.

ఇవి కూడా చదవండి: