Last Updated:

Nigeria: నైజీరియాలో దాడులు.. 14 మందిని చంపి 60 మందిని కిడ్నాప్ చేసిన దుండగులు

నైజీరియాలో దుండగులు ఆదివారం చేసిన దాడుల్లో 14మందిని చంపి 60 మందిని అపహరించారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుండి పలువురిని కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.

Nigeria: నైజీరియాలో దాడులు.. 14 మందిని చంపి 60 మందిని కిడ్నాప్ చేసిన దుండగులు

Nigeria:నైజీరియాలో దుండగులు ఆదివారం చేసిన దాడుల్లో 14మందిని చంపి 60 మందిని అపహరించారు. రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయం నుండి పలువురిని కిడ్నాప్ చేసిన రెండు రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. మరోవైపు దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఇస్లామిక్ తిరుగుబాటుదారులు మిలిటరీ ఎస్కార్ట్‌లో వాహనాల కాన్వాయ్‌పై మెరుపుదాడి చేయడంతో ఇద్దరు సైనికులు మరియు నలుగురు పౌరులు మరణించారు.

ఐదు వాహనాలకు నిప్పు..(Nigeria)

దాడి చేసిన వ్యక్తులు ఐదు వాహనాలకు నిప్పుపెట్టి, ఒక ట్రక్కుతో వెళ్లిపోయారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు.జంఫారాలోని గ్రామీణ మాగామి కమ్యూనిటీలోని ఫార్వర్డ్ ఆర్మీ బేస్‌పై ఆదివారం తెల్లవారుజామున ముష్కరులు దాడికి ప్రయత్నించారని, అయితే వారు తిప్పికొట్టారని నివాసితులు తెలిపారు. స్థానికంగా బందిపోట్లు అని పిలువబడే సాయుధ ముఠాలు డబ్బు కోసం చేసే కిడ్నాప్‌ల వల్ల తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో జంఫారా ఒకటి.మూడు గ్రూపులుగా ఏర్పడిన ముష్కరులు ఆర్మీ బేస్‌పై మరియు మాగామి మరియు కబాసా సంఘాలపై దాడి చేశారని స్దానిక సంఘం నాయకుడు చెప్పారు. నైజీరియాలోని వాయువ్యంలో దాడులు జరుగుతున్నాయి. ఇస్లామిక్ యోధులు ఇప్పటికీ ఈశాన్య ప్రాంతంలో ఘోరమైన దాడులను చేస్తున్నారు. ముఠాలు మరియు వేర్పాటువాదులు ఆగ్నేయంలో భద్రతా దళాలు , ప్రభుత్వ భవనాలపై దాడులకు పాల్పడుతున్నారు.