Published On:

Miss World Contest: మిస్ వరల్డ్ పోటీలు.. హైదరాబాద్ కు అందాల భామలు

Miss World Contest: మిస్ వరల్డ్ పోటీలు.. హైదరాబాద్ కు అందాల భామలు

Hyderabad: మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ముస్తాబైంది. ఈనెల 10 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనుంది. హైటెక్స్ వేదికగా జరగనున్న ఈ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 120 నుంచి అందాల భామలు భారత్ రానున్నారు. ఇప్పటికే 109 దేశాల నుంచి కంటెస్టెంట్స్ నగరానికి చేరుకున్నారు. మిగిలినవారు రేపటిలోగా హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది. కాగా పోటీలో భారత్ తరపున పోటీ చేయనున్న నందిని గుప్తా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇక పోటీకి విచ్చేస్తున్న కంటెస్టెంట్స్, అతిథులు, ప్రముఖులు బస చేసేందుకు స్టార్ హోటళ్లను బుక్ చేసింది. ఆయా హోటళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసింది. పోటీలకు అమెరికా, జపాన్, కెనడా, వెనిజులా, చైనా, యూకే, సౌతాఫ్రికా.. ఇలా పలు దేశాల నుంచి భామలు విచ్చేశారు.

 

కాగా మిస్ వరల్డ్ పోటీలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. పోటీదారులకు, కార్యక్రమానికి విచ్చేసే ప్రముఖులకు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తోంది. అలాగే రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేయనుంది. అలాగే రాష్ట్రంలోని పలు పురాతన, పర్యాటక ప్రదేశాలను చూపించనుంది. రాష్ట్ర చరిత్ర, విశిష్టత తెలిపే ఫోటో గ్యాలరీలను ఏర్పాటు చేయనుంది. ఇక తెలంగాణ వంటకాలను కూడా రుచి చూపించనుంది. అందులో భాగంగానే పోటీకి విచ్చేసిన అందాల భామలు, అతిథులకు ప్రభుత్వం తరపున విందు ఇవ్వాలని నిర్ణయించింది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే కార్యక్రమాన్ని విచ్చేస్తున్న అతిథులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు.