Prabhas: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన – స్పందించిన ప్రభాస్

Prabhas Post on Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన దుర్ఘటన ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఎయిరిండియా విమాన దుర్ఘటనపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు.
ఈ దుర్ఘటన దేశానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ షేర్ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. “ఇది నిజంగా దేశానికి దుర్దినము. అహ్మదాబాద్ క్రాష్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నా ఆలోచనలు, ప్రార్థనలు వారితోనే ఉంటాయి” అంటూ ప్రభాస్ తన పోస్ట్లో పేర్కొన్నారు.
కాగా ఈ విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 160 మంది భారతీయలుఉ 53 మంది బ్రిటిషియులు, ఒక కెనడియన్, 11 మంది పోర్చుగల్ వాళ్లు ఉన్నారు. ఇందులో ఒక్కరు ప్రాణాలతో బయటపడగా.. మిగిలిన వారంత ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్లెయిన్ క్రాష్ సమయంలో ఇద్దరు పిసిపిల్లలు, చిన్నారులు కూడా ఉన్నారు. కాగా ప్రస్తుతం ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ(ప్రచారంలో ఉన్న టైటిల్), ది రాజాసాబ్, సలార్ 2, కల్కి 2తో పాటు స్పిరిట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
స్పిరిట్ మినహా మిగతా చిత్రాల్ని షూటింగ్స్ని శరవేగంగా జరుపుకుంటున్నాయి. త్వరలోనే స్పిరిట్ మూవీ కూడా సెట్స్పై రానుంది. ఇక ప్రభాస్ నటించి ది రాజాసాబ్ మూవీ ఇక రిలీజ్కు సిద్ధమౌతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో ఈ మూవీ రూపొందుతుంది. హారర్, కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ప్రతి కథనాయకుడిగా కనిపించబోతున్నాడు.