Manchu Manoj @ Bhairavam Event: శివయ్యా.. అంటే శివుడు రాడు.. అన్న విష్ణుకి మనోజ్ కౌంటర్!

Manchu Manoj Counter to Manchu Vishnu at Bhairavam Event: మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. నారా రోహిత్, బెల్లకొండ సాయి శ్రీనివాస్, మచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘భైరవం’. నాంది, ఉగ్రం వంటి బ్లాక్బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మే 30న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఏలూరు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మనజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. పదేళ్ల తర్వాత వస్తున్న మనోజ్.. స్టేజ్పై మాట్లాడుతుంటే అభిమాలతో అరుస్తూ అతడిని నీరాజనాలు తెలిపారు. ఆ అభిమానం చూసి ఒక్కసారిగా కన్నీరుపెట్టుకున్నాడు. ‘తెరపై కనిపించి తొమ్మిదేళ్లు అవుతుంది. ఎన్ని జన్మలు ఎత్తిన నా దర్శకుడు(విజయ్ కనకమేడల) రుణం తీర్చుకోలేను. ఈ తొమ్మిదేళ్లలో కొన్ని సినిమాలు చేశాను. కానీ, లాకౌడౌన్, వ్యక్తిగత కారణాల వల్ల వాటిని ఆపేయాల్సి వచ్చింది. నాకు సినిమా తప్పా ఏం తెలియదు. నాకు ఊహా తెలియకముందే సినిమాల్లోకి వచ్చాను. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత దొంగ దొంగది చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాను’ అని చెకొచ్చాడు.
అనంతరం మంచు కుటుంబంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మనోజ్ పరోక్షంగా మాట్లాడాడు. ‘సొంత వాళ్లే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకొన ఇంత ప్రేమను పంచుతున్నారు. ఈ గుండె ఇంత ధైర్యంగా ఉందంటే అది మీ వల్లే. భార్య, ఇద్దరు పిల్లలు అయిన నా చిన్న కుటుంబానికి మీరే పెద్ద కుటుంబం. ఇదికో మీ కుటుంబం అని మిమ్మల్ని చూపిస్తాను. ఇంత ప్రేమను పంచుతున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం. శివయ్యా.. అని పిలిస్తే శివుడు రాడు.. ఆయననీ మనసారా తలుచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలోనో వస్తాడు” అంటూ తన అన్నయ్య మంచు విష్ణుకి ఇన్డైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు.
“ఈ మధ్య కాలంలో ఎన్నో జరిగాయి. ఎన్నో ఎదుర్కొన్నాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు. నేను ఊరు వెళ్లొచ్చేసరికి నా పిల్లల వస్తువులతో సహా అన్ని రోడ్డు మీద పెట్టారు. బయటకు వెళ్లడానికి కార్లు లేకుండా తీసుకెళ్లిపోయారు. కానీ.. నాకు ఫ్యాన్స్ రూపంలో ఆ శివుడు సాయం చేశాడు. ఇంటి బయట 20 కార్లు పెట్టించాడు. వాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టిన.. సహనంగానే ఉంటాను. ఎవరి మీద నాకు కోపం లేదు. నా చివరి కట్టే కాలేవరకూ నేను మోహన్ బాబు కొడుకునే. చిన్నప్పటి నుంచి నీతి, న్యాయం వైపు నిలబడాలని పెంచారు. ఇప్పుడు అదే చేస్తుంటే తప్పు అంటున్నారు” అని చెప్పుకొచ్చాడు.