Khairatabad Ganesh : ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా ఖైరతాబాద్ గణపతి.. ఘనంగా తొలిపూజ
Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్లో జరిగే మహాగణపతి 71వ వేడుకలను శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా కర్రపూజ (తొలిపూజ) నిర్వహించారు. ఈ సారి 69 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కర్రపూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్, గణేశ్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు 69 అడుగుల ఎత్తులో దర్శనమివ్వనున్నారు. ఈసారి గణపతి రూపాన్ని శ్రీ విశ్వశాంతి మహాశక్తిగా రూపొందిస్తున్నారు. మహాగణపతికి కుడి వైపు శ్రీజగన్నాథ స్వామి, శ్రీలక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దర్శనమిస్తే, ఎడమవైపు లలిత త్రిపురసుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి కొలువై ఉంటారు. ఉత్సవ సమితి సభ్యులు ఈ ఏడాది గణపతి రూపాన్ని అధికారికంగా విడుదల చేశారు.