Air India plane crash : బ్లాక్బాక్స్ ఇంకా దొరకలేదు.. వస్తున్న వార్తల్లో నిజం లేదు : ఎయిర్ ఇండియా

Air India : అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభించినట్లు వస్తున్న ఊహాగానాలను ఎయిర్ ఇండియా కొట్టిపడేసింది.
విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని ఒక ప్రకటనలో పేర్కొంది. దొరికినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ప్రమాదానికి గురైన విమాన శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను ఎయిర్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఏటీసీ అధికారి ఒకరు విషయాన్ని ధ్రువీకరించారు.
ఏమిటీ బ్లాక్ బాక్స్..
ప్రతి కమర్షియల్ విమానంలో రెండు బ్లాక్ బాక్స్లు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటాను రికార్డు చేయగా, మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డుకు ఉపయోగపడుతుంది. విమానాలకు ఏదైనా ముప్పు వాటిల్లినప్పుడు ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు పైలట్ మేడే అంటూ సందేశాన్ని పంపుతారు. అది కాక్పిట్లో రికార్డు అవుతోంది. ఈ సమయంలో వారు మాట్లాడుకున్న విషయాలు అందులో రికార్డు అవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు బ్లాక్బాక్స్లోని డిజిటల్ ఫైర్ డాటా రికార్డర్ (డీఎఫ్డీఆర్)ను డీకోడ్ చేస్తారు. దీంతో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి.