Last Updated:

Kodandaram: టీ కాంగ్రెస్ కు ’కోదండరాం‘ షాక్

మునుగోడు ఉప ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య కాక రేపుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో చిన్నాచితకా పార్టీలు కూడా అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నాయి.

Kodandaram: టీ కాంగ్రెస్ కు ’కోదండరాం‘ షాక్

Munugode: మునుగోడు ఉప ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య కాక రేపుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో చిన్నాచితకా పార్టీలు కూడా అదృష్టాన్నిపరీక్షించుకుంటున్నాయి. ప్రముఖ విప్లవ గాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతిలో ఆయన చేరిపోయారు. ఆయనకు కొన్ని ప్రజాసంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడ్డారు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ తో సాన్నిహిత్యం నెరిపారు. అధికార టీఆర్ఎస్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల వేళ టీజేఎస్ అధినేత కోదండరాం, కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చారు. ఇన్నాళ్లు సాగిన వీరి బంధానికి బీటలు పడ్డాయి. మునుగోడు ఉప ఎన్నికకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్‌ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ తెలంగాణలో ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. ఆ మూడు పార్టీలు ఇప్పటికే మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం పావులు కదుపుతున్నాయి ప్రధాన పార్టీలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్‌లే బలమైన అభ్యర్థులను దింపుతాయని అనుకుంటే సడెన్‌గా  కేఏ పాల్ పార్టీ ‘ప్రజాశాంతి పార్టీ’ నుంచి ప్రజా యుద్ధనౌక గద్దర్ పోటీలోకి దిగడం సంచలనమైంది. ఇదే ఆశ్చర్యపరిస్తే, తాజాగా ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కూడా మునుగోడు పోటీలోకి దిగనుండటం ఆసక్తికరంగా మారింది. రెండు మూడు రోజుల్లో టీజేఎస్ అభ్యర్థిని ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు.

మరోవైపు, మునుగోడులో తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోదండరాంను టీపీసీసీ నేతలు కోరారు. టీఆర్ఎస్, బీజేపీని ఓడించేందుకు టీజేఎస్ పోటీ నుంచి తప్పుకోవాలని, తమకు మద్దతు ప్రకటించాలని కోదండరాంను గతంలో కోరారు. కానీ మద్దతు ఇవ్వడం పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం టీకాంగ్రెస్ నేతలకు గతంలో సూచించారు. ఒక దశలో కోదండరాం మునుగోడులో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా టీజేఎస్ బరిలోకి దిగనుండడం కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చినట్టేనని చెప్పొచ్చు. అయితే, ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్నా చితకా పార్టీలు కూడా మునుగోడు ఎన్నికల్లో పోటీచేస్తే, విపక్ష ఓట్లు చీలే అవకాశం ఉంది. అది అంతిమంగా అధికార టీఆర్‌ఎస్‌కు ఉపయోగపడవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టీజేఎస్‌, ప్రజాశాంతి పార్టీ చీల్చే ఓట్లు ఫలితాల పై ప్రభావం చూపే చాన్స్‌ ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇవి కూడా చదవండి: