Last Updated:

Stubble Burning: పంట వ్యర్దాలను దగ్డం చేయడాన్ని ఆపాలి.. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశం

ఢిల్లీని ఏటా తీవ్ర వాయు కాలుష్యం బారిన పడేలా చేయడం సరి కాదని పంట వ్యర్దాలను తగులబెట్టడంపై ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో భాగస్వామ్య పక్షాలందరినీ బుధవారం సమావేశమై సమావేశం కావాలని సుప్రీంకోర్టు కోరింది.

Stubble Burning: పంట వ్యర్దాలను దగ్డం చేయడాన్ని ఆపాలి..  ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు  ఆదేశం

Stubble Burning: ఢిల్లీని ఏటా తీవ్ర వాయు కాలుష్యం బారిన పడేలా చేయడం సరి కాదని పంట వ్యర్దాలను తగులబెట్టడంపై ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం తప్పుబట్టింది. ఈ వ్యవహారంలో భాగస్వామ్య పక్షాలందరినీ బుధవారం సమావేశమై సమావేశం కావాలని సుప్రీంకోర్టు కోరింది.

ఎలాగయినా సరే ఆగిపోవాలి..(Stubble Burning)

సంబంధిత సెక్రటరీ భౌతికంగా లేదా జూమ్ చేసినా రేపు సమావేశానికి పిలవాలని ఆదేశించింది. కాలుష్యం కారణంగా దేశ రాజధానిలో పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఎలా బాధపడుతున్నారో రాష్ట్రాల తరపున హాజరైన న్యాయవాదులందరికీ జస్టిస్ కౌల్ వివరించారు. ఇలా ఉండగా పంట వ్యర్దాల దహనం 20-50 రోజులు మాత్రమే జరుగుతుందని పంజాబ్ ఏజీ తెలిపారు. మీరు దీన్ని ఎలా చేస్తారో మేము పట్టించుకోము.. అది ఆగిపోవాలి. కొన్నిసార్లు బలవంతపు చర్యల ద్వారా మరియు కొన్నిసార్లు ప్రోత్సాహకాల ద్వారా అయినా” అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది జస్టిస్ కౌల్ పంజాబ్ ఏజీ తో మాట్లాడుతూ మీ పరిపాలన తప్పక చేయాలి. మీ స్థానిక ఎస్ హెచఖ వో బాధ్యత వహించాలి. ఈ రోజు నుండి, వారు దాని పనిని ప్రారంభించాలని చెప్పారు.

అదేవిదంగా దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలను ఆపడానికి తీసుకున్న చర్యల గురించి కూడా బెంచ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నగరంలో కాలుష్యానికి ప్రధాన వనరుల్లో వాహన కాలుష్యం ఒకటి.విచారణ సందర్భంగా, ఢిల్లీలో ఏర్పాటు చేసిన స్మోగ్ టవర్ పనిచేయడం లేదని అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ కోర్టుకు తెలిపారు. దీనిపై ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మందలించింది.మునుపటి ఆదేశాల తర్వాత ఏర్పాటు చేసిన స్మోగ్ టవర్ పని చేయడం లేదని పేర్కొంది.ఇది హాస్యాస్పదంగా ఉంది. మేము టవర్లు పని చేయాలని కోరుకుంటున్నాము అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.పంజాబ్‌లో, ఈ సీజన్‌లో 78 శాతం పంట వ్యర్దాల దగ్ధం కేసులు గత ఎనిమిది రోజుల్లోనే జరిగాయి. సోమవారం నాడు పంజాబ్‌లో 2,060 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని గాలి నాణ్యత, అదే సమయంలో, ‘చాలా పేలవమైన’ కేటగిరీకి మారింది. మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) 395 వద్ద నమోదైంది.ఢిల్లీ నగరం మందపాటి, విషపూరిత పొగమంచుతో కప్పబడి ఉంది.
ి