Published On:

Supreme Court: హైకోర్టుల జడ్జిల బదిలీకి  ‘సుప్రీం’  కొలీజియం సిఫారసు.. ఏపీకి ఒకరు, తెలంగాణకు ముగ్గురు బదిలీ!

Supreme Court: హైకోర్టుల జడ్జిల బదిలీకి  ‘సుప్రీం’  కొలీజియం సిఫారసు.. ఏపీకి ఒకరు, తెలంగాణకు ముగ్గురు బదిలీ!

Supreme Collegium: ‘సుప్రీం’ కొలీజియం హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేసింది. ఈ నెల 26న జరిగిన సమావేశంలో కొలీజియం నిర్ణయం తీసుకుంది. 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీలకు సిఫారసు చేసింది. న్యాయమూర్తి సుజోయ్ పాల్ తెలంగాణ నుంచి కలకత్తాకు బదిలీ బదిలీ చేసింది. న్యాయమూర్తి వి.కామేశ్వర్‌రావు కర్ణాటక నుంచి ఢిల్లీకి బదిలీ కాగా, న్యాయమూర్తి సుంకుమ్ జామిర్ గౌహతి నుంచి కలకత్తాకు బదిలీ చేసింది. న్యాయమూర్తి మనాష్ రంజన్ పాఠక్ గౌహతి నుంచి ఒరిస్సాకు బదిలీ కాగా, న్యాయమూర్తి నితిన్ వాసుదేవ్ సంప్రే బాంబే నుంచి ఢిల్లీకి, న్యాయమూర్తి అశ్విని కుమార్ మిశ్రా అలహాబాద్ నుంచి పంజాబ్‌-హర్యానాకు, న్యాయమూర్తి సుమన్ శ్యామ్ గౌహతి నుంచి బాంబేకు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది.

 

న్యాయమూర్తి సంజీవ్ ప్రకాశ్‌శర్మ పంజాబ్-హర్యానా నుంచి రాజస్థాన్‌కు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది. న్యాయమూర్తి వివేక్ చౌదరి అలహాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ, న్యాయమూర్తి దినేశ్ కుమార్‌సింగ్ కేరళ నుంచి కర్ణాటకకు బదిలీ చేసింది. వివేక్ కుమార్ సింగ్ చెన్నై నుంచి మధ్యప్రదేశ్‌కు, బట్టు దేవానంద్ చెన్నై నుంచి ఏపీ బదిలీ కాగా, ఓంప్రకాశ్ శుక్లా అలహాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయగా, న్యాయమూర్తి శ్రీచంద్రశేఖర్ రాజస్థాన్ నుంచి బాంబేకు, న్యాయమూర్తి సుధీర్ సింగ్ పంజాబ్-హర్యానా నుంచి పట్నాకు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది.

 

న్యాయమూర్తి అనిల్ ఖేతర్పాల్ పంజాబ్‌-హర్యానా నుంచి ఢిల్లీకి బదిలీ చేస్తూ సిఫారసు చేసింది. అరుణ్ కుమార్ మోంగా రాజస్థాన్ నుంచి ఢిల్లీకి బదిలీ కాగా, జయంత్ బెనర్జీ అలహాబాద్ నుంచి కర్ణాటకకు బదిలీ కాగా, సి.సుమలత కర్ణాటక నుంచి తెలంగాణకు బదిలీ చేసింది. లలిత కన్నెగంటి కర్ణాటక నుంచి తెలంగాణకు బదిలీ కాగా, అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి పట్నా నుంచి తెలంగాణకు బదిలీ చేయాలని కొలీజియం సూచించింది.

 

ఇవి కూడా చదవండి: