Published On:

PM Modi: భోపాల్ లో నేడు ప్రధాని మోదీ పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

PM Modi: భోపాల్ లో నేడు ప్రధాని మోదీ పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Bhopal: ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో పర్యటించనున్నారు. లోకమాత దేవీ అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్ లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జంబోరి గ్రౌండ్ లో మహిళా సాధికారత మహా సదస్సుకు హాజరై.. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.

 

సదస్సుకు హాజరయ్యే మహిళలు సింధూర రంగు చీర ధరించాలని విజ్ఞప్తి చేశారు. లోకమాతదేవి అహల్యాబాయి పోస్టల్ స్టాంపును, రూ. 300 ప్రత్యేక నాణెం విడుదల చేయనున్నారు. పర్యటనలో భాగంగా ఇండోర్ మెట్రో, దాతియా- సత్నా ఎయిర్ పోర్టును వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఉజ్జయినిలో 29 కిలోమీటర్ల పొడవైన ఘాట్ కు వర్చువల్ గా భూమిపూజ చేస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.