Published On:

CM Chandrababu: కోనసీమ జిల్లాలో నేడు సీఎం పర్యటన.. పింఛన్ల పంపిణీకి హాజరు

CM Chandrababu: కోనసీమ జిల్లాలో నేడు సీఎం పర్యటన.. పింఛన్ల పంపిణీకి హాజరు

AP: ఏపీ సీఎం చంద్రబాబు నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరులో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి.. నేరుగా వారికి పెన్షన్ ఇవ్వనున్నారు. అనంతరం బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో సమావేశం కానున్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుంటుంబాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.

అయితే రాష్ట్రంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ పంపిణీ జరుగుతోంది. ఒకవేళ ఒకటో తేదీ సెలవు కానీ, ఆదివారం అయితే ముందురోజే పెన్షన్ పంపిమఈ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నేడు పింఛన్ పంపిణీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెల ఒకటో తేదిన పింఛన్ పంపిణీ జరగుతుంది. అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నగదు అందిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు సైతం ప్రతినెల ఏదో ఒక గ్రామంలో పింఛన్ పంపిణీ చేస్తున్నారు. కాగా కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.