Published On:

Hyderabad : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత.. సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం

Hyderabad : బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత.. సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం

Magam Ranga Reddy : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా చేసిన రంగారెడ్డి.. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కిరణ్ కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత మాగం రంగారెడ్డి కూడా అదే పార్టీలో చేశారు. మాగం మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం శామీర్‌పేటలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

 

సీఎం రేవంత్ సంతాపం..
మాగం రంగారెడ్డి మృతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రంగారెడ్డి మృతిపట్ల వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి: