Uttarakhand: ఉత్తరకాశీలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఐదుగురు దుర్మరణం

4 ki Crashes in Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పర్యాటకులు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్రీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే వీరంతా హెలికాప్టర్లో గంగోత్రి వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ఉన్నారు. ఇందులో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
అయితే, గంగోత్రికి వెళ్లాలంటే.. హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి హర్సిల్ హెలిప్యాడ్ వరకు వెళ్తోంది. అక్కడి నుంచి పర్యాటకులు రోడ్డు మార్గంలో గంగ్నానికి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఎస్డీఆర్ఎఫ్, జిల్లా సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.