Home / Uttarakhand
57 Workers Feared Trapped In Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలో జరిగిన హిమపాతం కింద కనీసం 57 మంది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా భారీగా మంచు కురుస్తుంది. అయితే ఇవాళ ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన బద్రీనాథ్ ధామ్లోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. బద్రీనాథ్ ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామ సమీపంలోని ఆర్మీ క్యాంప్ […]
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. . 23 మంది ప్రయాణికులతో బయలు దేరిన టెంపో ట్రావెలర్ లోయలో పడ్డంతో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఉత్తరాఖండ్లోని భద్రీనాథ్ జాతీయ రహదారిలో రుద్రప్రయాగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం బాబా రాందేవ్కు చెందిన కంపెనీ పతంజలి ఆయుర్వే లిమిటెడ్, దివ్య ఫార్మసీపై కొరఢా ఝళిపించింది. ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు రాందేవ్తో పాటు ఆయన సహచరుడు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ ప్రొడక్టులతో అన్నీ రోగాలు మాయం అవుతాయని తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని సుప్రీంకోర్టు మండిపడింది.
17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రార్థనలు ఫలించి, ఎట్టకేలకు ఉత్తరకాశీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగం నుంచి కార్మికులను బయటకు తీసుకు వచ్చే సమయం దగ్గర పడిందని ఒక అధికారి మంగళవారం తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా సోషల్ మీడియా పోస్ట్లో కార్మికులను బయటకు తీయడానికి సొరంగంలో పైపులు వేసే పని పూర్తయింది అని ధృవీకరించారు.
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో టన్నెల్ నుంచి 41మంది కూలీలను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్లో భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది.టన్నెల్ ముందు నుంచి అగర్ మెషిన్ ద్వారా చేస్తున్న డ్రిల్లింగ్ పనులు పూర్తి కాకముందే మెషిన్ బ్లేడ్లు ముక్కలుముక్కలుగా విరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్మికులందరి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు నిరంతరం కమ్యూనికేషన్ను కొనసాగిస్తున్నాయి. 2 కి.మీ మేర ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మనోధైర్యాన్ని ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోవడంతో సుమారుగా 40 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.నేషనల్ మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలే మరియు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉత్తరాఖండ్లో పర్యటించారు. అతను శివుని పవిత్ర నివాసంగా భావించే ఆది కైలాస శిఖరం నుండి తన పర్యటనను ప్రారంభించారు. పార్వతి కుంద్ లోని ఆది కైలాస శిఖరం వద్ద ప్రార్థనలు చేశారు. తెల్లటి వస్త్రాలు ధరించిన మోదీ స్దానిక పూజారులు వీరేంద్ర కుటియాల్ మరియు గోపాల్ సింగ్ ల సూచనల మేరకు పూజలు నిర్వహించారు.
ఉత్తరాఖండ్లోని మాల్దేవ్తాలోని డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం సోమవారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య కుప్పకూలింది. భారత వాతావరణ శాఖ (IMD) ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.